Webdunia - Bharat's app for daily news and videos

Install App

వదినపై అలా కసి తీర్చుకున్నాడు.. హత్య చేసి.. శవాన్ని కాల్చేశాడు..

Webdunia
సోమవారం, 24 మే 2021 (17:48 IST)
పగతో వదినపై కసి తీర్చుకున్నాడు.. ఓ మరిది. వదినను అతి కిరాతకంగా మరిది హత్య చేసిన ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటి పరిధిలోని రామాపురంలో చోటుచేసుకుంది. వదినను చంపి ఆ తర్వాత శవాన్ని కాల్చేశాడు. ఆపై పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ ఘటన శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే. మృతురాలి పేరు రేక బయ్యమ్మ(55). రామాపురంలో తన ఇంట్లో ఒంటరిగా ఉంటుంది.
 
తనను జైలుకి పంపిందనే ప్రతీకారంతోనే వదినను హత్య చేసినట్టు నిందితుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. 2004లో జరిగిన సోదరుడు రేఖ పిచ్చయ్య హత్య కేసు తనపై అన్యాయంగా మోపడంతో తాను మూడు నెలలు జైలులో ఉన్నానని.. ఆ పగతోనే వదినను హత్య చేశానని సైదులు పోలీసులతో చెప్పాడు.
 
ఇటీవల నుంచి ఇంటి స్థలం, పొలం విషయంలో తరచుగా గొడవ జరుగుతోందని వీటిని దృష్టిలో పెట్టుకుని తన తల్లి బయ్యమ్మను హత్య చేశారని మృతురాలి కూతురు కవిత చెప్పింది. హుజూర్‌నగర్‌ సీఐ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 
 
మృతదేహాన్ని తీసుకెళ్లిన ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. బయ్యమ్మ కూతరు ఫిర్యాదు మేరకు పోలీసులు రేక సైదులు, భార్య ఎల్లమ్మ, ఇద్దరు కుమారులు ఉపేందర్‌, హేమంత్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments