Webdunia - Bharat's app for daily news and videos

Install App

వదినపై అలా కసి తీర్చుకున్నాడు.. హత్య చేసి.. శవాన్ని కాల్చేశాడు..

Webdunia
సోమవారం, 24 మే 2021 (17:48 IST)
పగతో వదినపై కసి తీర్చుకున్నాడు.. ఓ మరిది. వదినను అతి కిరాతకంగా మరిది హత్య చేసిన ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటి పరిధిలోని రామాపురంలో చోటుచేసుకుంది. వదినను చంపి ఆ తర్వాత శవాన్ని కాల్చేశాడు. ఆపై పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ ఘటన శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే. మృతురాలి పేరు రేక బయ్యమ్మ(55). రామాపురంలో తన ఇంట్లో ఒంటరిగా ఉంటుంది.
 
తనను జైలుకి పంపిందనే ప్రతీకారంతోనే వదినను హత్య చేసినట్టు నిందితుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. 2004లో జరిగిన సోదరుడు రేఖ పిచ్చయ్య హత్య కేసు తనపై అన్యాయంగా మోపడంతో తాను మూడు నెలలు జైలులో ఉన్నానని.. ఆ పగతోనే వదినను హత్య చేశానని సైదులు పోలీసులతో చెప్పాడు.
 
ఇటీవల నుంచి ఇంటి స్థలం, పొలం విషయంలో తరచుగా గొడవ జరుగుతోందని వీటిని దృష్టిలో పెట్టుకుని తన తల్లి బయ్యమ్మను హత్య చేశారని మృతురాలి కూతురు కవిత చెప్పింది. హుజూర్‌నగర్‌ సీఐ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 
 
మృతదేహాన్ని తీసుకెళ్లిన ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. బయ్యమ్మ కూతరు ఫిర్యాదు మేరకు పోలీసులు రేక సైదులు, భార్య ఎల్లమ్మ, ఇద్దరు కుమారులు ఉపేందర్‌, హేమంత్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments