Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మూడు రోజుల వ్యవధిలో భార్యాభర్తలిద్దరూ కరోనాతో మృతి

మూడు రోజుల వ్యవధిలో భార్యాభర్తలిద్దరూ కరోనాతో మృతి
, సోమవారం, 24 మే 2021 (09:35 IST)
ఖమ్మం జిల్లా కూసుమంచిలో విషాదం చోటుచేసుకుంది. మూడు రోజుల వ్యవధిలో భార్యాభర్తలిద్దరూ కరోనాతో మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. కూసుమంచికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి కందుల వెంకటేశ్వర్లు, భార్య డేవిడ్ మణి కొవిడ్ బారిన పడి కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
తన తల్లిదండ్రులను చూసేందుకు భర్త దామళ్ల రాము(34)తో కలిసి శైలజ కొత్తగూడెం ఆస్పత్రికి వెళ్లారు. ఈ క్రమంలోనే వీరిద్దరికి వైరస్ సోకింది. కరోనా కాటుకు మొన్న భార్య ప్రాణాలు కోల్పొగా.. ఈరోజు ఆమె భర్త రాము ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 
 
ఇదిలా ఉండగా రాము హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. మూడు రోజుల వ్యవధిలో భార్య, భర్తలిద్దరూ మరణించడంతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తుఫాన్ ప్రభావం... పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ