Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ ప్రాణం తీసింది.. మెట్టెలు, పుస్తెలతాడును చూసి..?

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (10:09 IST)
ప్రేమ ప్రాణం తీసింది. ప్రేమికుడిని వివాహం చేసుకుని.. ఒంటరిగా ఇంటికొచ్చిన ఓ యువతిని తల్లిదండ్రులు దూషించడంతో తీవ్ర మనస్తాపం చెందింది. ఇంకా గుట్టుగా ప్రేమ వివాహం చేసుకున్నందుకు తల్లిదండ్రులు తీవ్రస్థాయిలో మందలించడంతో ఆ యువతి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే... నేరేడుగొమ్ము మండల కేంద్రానికి చెందిన వరికుప్పల శ్రీను-సుజాత కూతురు రూప(21) హైదరాబాద్‌లో నర్సింగ్ శిక్షణ పొందుతూ అక్కడే నాంపల్లి మండలం మల్లరాజుపల్లి గ్రామానికి చెందిన సత్యంను ప్రేమించింది. సత్యం తల్లిదండ్రులు వీళ్ల పెళ్లికి నిరాకరించడంతో గుట్టుగా వివాహం చేసుకుని ఇటీవల స్వగ్రామంలో జరిగిన పండుగకు వచ్చారు. 
 
సత్యం తల్లిదండ్రులు దూషించడంతో ఒంటరిగా నేరేడుగొమ్ములోని తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. మెట్టెలు, పుస్తెలతాడును చూసి తల్లిదండ్రులు సైతం తీవ్రంగా మందలించడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగింది. దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments