Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ ప్రాణం తీసింది.. మెట్టెలు, పుస్తెలతాడును చూసి..?

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (10:09 IST)
ప్రేమ ప్రాణం తీసింది. ప్రేమికుడిని వివాహం చేసుకుని.. ఒంటరిగా ఇంటికొచ్చిన ఓ యువతిని తల్లిదండ్రులు దూషించడంతో తీవ్ర మనస్తాపం చెందింది. ఇంకా గుట్టుగా ప్రేమ వివాహం చేసుకున్నందుకు తల్లిదండ్రులు తీవ్రస్థాయిలో మందలించడంతో ఆ యువతి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే... నేరేడుగొమ్ము మండల కేంద్రానికి చెందిన వరికుప్పల శ్రీను-సుజాత కూతురు రూప(21) హైదరాబాద్‌లో నర్సింగ్ శిక్షణ పొందుతూ అక్కడే నాంపల్లి మండలం మల్లరాజుపల్లి గ్రామానికి చెందిన సత్యంను ప్రేమించింది. సత్యం తల్లిదండ్రులు వీళ్ల పెళ్లికి నిరాకరించడంతో గుట్టుగా వివాహం చేసుకుని ఇటీవల స్వగ్రామంలో జరిగిన పండుగకు వచ్చారు. 
 
సత్యం తల్లిదండ్రులు దూషించడంతో ఒంటరిగా నేరేడుగొమ్ములోని తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. మెట్టెలు, పుస్తెలతాడును చూసి తల్లిదండ్రులు సైతం తీవ్రంగా మందలించడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగింది. దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments