Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారులో మూడు ముళ్లు.. మైకులో మంత్రాలు.. సిద్ధిపేటలో వెరైటీ మ్యారేజ్

Webdunia
సోమవారం, 17 మే 2021 (17:18 IST)
కరోనా వైరస్ నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా పెళ్ళిళ్లు జరిగిపోతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా మాస్క్ ధరించటం… భౌతిక దూరం పాటించటం…శానిటైజర్‌తో చేతులు శుభ్ర చేసు కోవటం వంటివి ఇప్పటికే అందరూ పాటిస్తున్నారు. 
 
తాజాగా కరోనా వేళ పెళ్లి చేసుకున్న జంటకు…ఒక పురోహితుడు దూరం పాటిస్తూ కారులో కూర్చుని మైక్ లో మంత్రాలు చదువుతూ వివాహ తంతు ముగించిన ఘటన సిధ్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కోహెడకు చెందిన సటికం భాగ్య- మల్లేశం దంపతుల కుమార్తె సౌమ్య వివాహం తంగళ్లపల్లికి చెందిన కృష్ణమూర్తితో కోహెడలో ఆదివారం జరిగింది. ఈ వివాహాన్ని పురోహితుడు ప్రసాద్‌రావు శర్మ.. మండపానికి వచ్చి కారులో వచ్చి…దురంగా కారులోనే కూర్చుని మంత్రాలు చదివి కార్యక్రమాన్ని నిర్వహించారు. 
 
మైక్‌ ద్వారా అన్నీ వివరంగా చెపుతూ కళ్యాణ వేదిక పై వధూవరులతో కార్యక్రమం జరిపించగా వరుడు వధువు మెడలో తాళి కట్టాడు. మొత్తానికి కరోనా వేళ చిత్ర విచిత్రాతి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments