Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ లాక్ డౌన్ ఇప్పట్లో పోయేలా లేదు, మనకిక పెళ్లి కాదని సూసైడ్ చేసుకున్న ప్రేమజంట

Webdunia
శనివారం, 9 మే 2020 (13:03 IST)
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం ఎక్కడికక్కడ జామ్ అయిపోయింది. ఇంటి నుంచి బయటకు వస్తే ఎక్కడ కరోనా వైరస్ పట్టుకుంటుందోనని జనం ఇళ్ల నుంచి బయటకు రావడంలేదు. ఐతే కొందరు మాత్రం ధైర్యం చేసి వచ్చేస్తున్నారు. ఈ కరోనా వైరస్ కొంతమంది ప్రేమికులను బలి తీసుకుంటోంది.
 
వివరాల్లోకి వెళితే... ఆసిఫాబాద్ పరిధిలోని నార్నూర్ మండలంలో ఖంపూర్ గ్రామంలో 20 ఏళ్ల సీతాబాయి 22 గణేష్ గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు ఆమోదం తెలిపారు. త్వరలో పెళ్లి చేద్దామని కూడా అనుకున్నారు. మే 3 తర్వాత లాక్ డౌన్ ముగియగానే పెళ్లి చేద్దామనుకున్నారు కానీ అది కాస్తా మే 17 వరకూ వెళ్లింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ మే 17 కాదు... నెలాఖరు వరకూ అని తెలిపింది.
 
కరోనా వైరస్ విజృంభించడం, లాక్ డౌన్ కాలం పెరుగుతుండటంతో ఇక తమకు ఇప్పట్లో పెళ్లి కాదని ఆందోళన చెందిన  ప్రేమ జంట మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గురువారం పొలం పనుల కోసం అని వెళ్లిన గణేష్ తన ప్రియురాలిని పిలిచి, ఇక లాక్‌డౌన్‌ ఎప్పుడు ముగుస్తుందోనని తీవ్రంగా ఆవేదన చెందాడు. ఈ విషయాన్ని ప్రియురాలు తన సోదరుడితో చెప్పి తాము ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ఫోన్లో సమాచారం అందించింది. హుటాహుటిన ఆమె సోదరుడు ఘటనా స్థలానికి వెళ్లగా అప్పటికే ఇద్దరూ విగతజీవులుగా కనిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలో ఉన్న అహంకారం రాలి పడింది : కోట శ్రీనివాస్ జ్ఞాపకాలు

డాకు మహారాజ్ నుంచి సుక్క నీరు లిరిక్ విడుదలచేశారు

సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కు మరింత వినోదం వుండేలా డిజైన్ చేస్తా : అనిల్ రావిపూడి

కెరీర్ లో యాక్షన్ టచ్ తో కామెడీ ఫిల్మ్ లైలా: విశ్వక్సేన్

తమ్ముడితో సెటిల్ చేస్తా.. మరి నాకేంటి అని అన్నయ్య అడిగారు? శ్రీసుధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments