Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్యతో మాటల్లేవ్... కిమ్‌కు సవతి పోరు.. అందుకే మాయమయ్యాడా?

భార్యతో మాటల్లేవ్... కిమ్‌కు సవతి పోరు.. అందుకే మాయమయ్యాడా?
, మంగళవారం, 5 మే 2020 (14:34 IST)
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ 20 రోజుల పాటు కనిపించకుండా పోయారు. ఆపై బయటికి వచ్చారు. ఓ ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా కిమ్ రిబ్బన్ కట్ చేశారని ఓ వార్తా సంస్థ వెల్లడించింది. ఇంతలోనే కిమ్ ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదనే వార్తలు ప్రపంచ వ్యాప్తంగా చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో కిమ్‌కి సవతి పోరంటూ వార్తలు వస్తున్నాయి. 
 
సాధారణంగా కిమ్‌కి అమ్మాయిల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు. అతను ఏ దేశం వెళ్ళిన సరే అందమైన అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటారని చెప్పారు. తన కేబినేట్‌లో ఉండే ఒక అందమైన అమ్మాయితో కిమ్ ప్రేమలో పడ్డాడట. ఆ అమ్మాయికి పెళ్లి అయింది. అయితే దేశ ద్రోహం కేసులో ఆమె భర్తకు జైలు శిక్ష విధించారు. మరి కిమ్ ఆ అమ్మాయి కోసం శిక్ష వేశాడని అందరూ అంటున్నారు. ఇందులో ఎంతమాత్రం నిజముందో తెలియదు.
 
అంత వరకు బాగానే ఉంది గాని… ఇప్పుడు ఆమె గురించి భార్యకు బాబు దూరంగా ఉన్నాడట. ఆ దేశ రాజధాని పాంగ్యాంగ్‌కి దగ్గరగా ఒక చిన్న రిసార్ట్ ఉంది. ఆ రిసార్ట్‌లో అతని భార్యతో కలిసి వెళ్ళే వాడు. ఇప్పుడు అతను ఆ అమ్మాయితో కలిసి అక్కడ ఉన్నాడట, ఈ విషయం తెలిసిన అతని భార్య అతని మీద గుర్రుగా వుందని.. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని.. ఫలితంగా భార్యతో మాటల్లేవని తెలిసింది. ఇక కిమ్ భార్యకు నచ్చజెప్పే పనిలో ఉన్నాడని, అసలు ఫ్యామిలీ గొడవలతోనే అతను బయటకు రాలేదు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం రమేష్‌కు కీలక పదవి... మోడీ - షా ఆశీస్సుల పుణ్యమేనా?