Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్షణాలు లేని కరోనా కేసులు.. 380 కేసులు చైనాలో నమోదు

Webdunia
శనివారం, 9 మే 2020 (12:33 IST)
కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకీ పెరిగిపోతుంది. వూహాన్ నగరం సహా హుబే ప్రావిన్స్‌లో ప్రస్తుతం కరోనా తన ప్రతాపం చూపించే అవకాశం వుందని తెలుస్తోంది. తాజాగా ఓ షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. తాజాగా నమోదైన కరోనా కేసులన్నీ ఎలాంటి లక్షణాలు లేకుండానే నమోదవుతున్నాయి. 
 
హుబే ప్రావిన్స్‌లో 380 కేసులు ఇప్పటివరకు నమోదు కాగా.. అందులో 377 కేసుల్లో ఒక్క లక్షణం కూడా బయటపడలేదు.  ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఆందోళనకరంగా ఉందని నిపుణులు అంటున్నారు. లాక్ డౌన్‌ని ఎత్తివేయడంతో జనాలు అందరూ కూడా ఒక్కసారిగా బయటకు వచ్చేశారు. 
 
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. దాదాపు 212 దేశాలకు ఈ వైరస్ పాకింది. ఇప్పటి ప్రపంచదేశాలన్నీ లాక్ డౌన్ కొనసాగిస్తున్నప్పటికీ.. మహమ్మారి విస్తరణకు అడ్డుకట్టవేయడం కుదరడం లేదు. తాజా లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 40,14,265కు చేరింది. వీరిలో 2,70,740 చనిపోగా..1,387,181 కోలుకున్నారు.
 
అటు అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసులు పెరుగుతూ 13 లక్షలను దాటేసింది. ఆ దేశంలో 1,322,163 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 78,616 మంది మృత్యువాత పడ్డాయి. ఇక లక్ష కరోనా కేసులు దాటిన దేశాల లిస్ట్‌లో స్పెయిన్, ఇటలీ, బ్రిటన్, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, టర్కీ, బ్రెజిల్ దేశాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్ వాయిదాకు కారణం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

86 ఏళ్ల వృద్ధుడిలో మింగే రుగ్మతను విజయవంతంగా పరిష్కరించిన విజయవాడ మణిపాల్ హాస్పిటల్

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments