Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడాదిన్నర బాబుకూ కరోనా వైరస్‌.. ఒకే రోజు రంగారెడ్డిలో..?

Webdunia
శనివారం, 9 మే 2020 (11:52 IST)
రంగారెడ్డి జిల్లాలో కరోనా వైరస్ పంజా విసిరింది. శుక్రవారం ఒక్కరోజే ఐదుగురికి పాజిటివ్ సోకింది. ఈ కేసులన్నీ వనస్థలిపురం హుడాసాయికి కాలనీకి చెందినవేనని అధికారులు తెలిపారు. ఈ ఐదుగురిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. వీరిలో భార్యాభర్తలతోపాటు 11 ఏళ్ల కూతురు, 8 ఏళ్ల కుమారుడు ఉన్నారు. 
 
ఇప్పటికే పాజిటివ్‌గా వచ్చిన ఓ వ్యక్తి ఇంట్లో ఈ కుటుంబం అద్దెకు ఉంటోంది. ఈ ఇంట్లోనే పనిచేస్తున్న ఓ మహిళకు చెందిన ఏడాదిన్నర బాబుకూ వైరస్‌ వ్యాప్తి చెందింది. వీరందరినీ నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
వరుసగా కేసులు నమోదవుతుండటంతో వనస్థలిపురం వాసులు భయం గుప్పిట్లో మగ్గుతున్నారు. యాక్టివ్‌ కేసులు తాజా కేసులతో కలుపుకుంటే జిల్లాలో కోరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 94కు చేరుకుంది. వీరిలో నలుగురు మృతి చెందారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments