కేటీఆర్‌కు కరోనా.. హోమ్ ఐసోలేషన్‌లో కేసీఆర్ ఫ్యామిలీ

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (09:32 IST)
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్ కుమార్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. తాజాగా మంత్రి కేటీఆర్‌కు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. 
 
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ వేదికగా ప్రకటించారు. తనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని.. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నానని పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా కోవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ.. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 
ktramarao
 
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనాబారినుండి సురక్షితంగా బయటపడాలంటూ టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు, మసీదుల్లో ప్రార్థనలు చేస్తున్నారు. 
 
ఇలా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి కూడా కేసీఆర్ పేరిట ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా మహమ్మారి నుంచి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో పరిపాలన చేపట్టాలని సుభాష్ రెడ్డి దుర్గమ్మను కోరుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఊరి మట్టినే ఆయుధంగా మలచి పోరాడిన వ్యక్తి కథగా పళ్లిచట్టంబి

సినీ కెరీర్‌కు స్వస్తి చెప్పనున్న హీరోయిన్ త్రిష?

Naga Shaurya: బ్యాడ్ బాయ్ కార్తీక్ తో నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను : నాగశౌర్య

చెన్నైలో బుల్లితెర నటి ఆత్మహత్య - భర్తతో వీడియో కాల్‌ చేసిన తర్వాత...

Adivi Sesh: మోకాలి గాయం కారణంగా మూడు నెలలు డెకాయిట్ డిలే అయింది : అడివి శేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

UP Woman Scripts History: ఖాట్మండు నుంచి ఎవరెస్ట్ వరకు సైకిల్ యాత్ర.. దివ్య సింగ్ రికార్డ్ (video)

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్

Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments