Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్ పట్టాభిషేకానికి అద్భుతమైన ముహూర్తం.. రథ సప్తమి రోజునే..?

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (09:39 IST)
KCR_KTR
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల తారకరామారావు పేరు ఖాయమైంది. అయితే, ఆయన పట్టాభిషేకం ఎప్పుడనే అంశం మీదే ఇప్పుడు అందరిలోనూ చర్చ జరుగుతోంది. దీని కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ దివ్యమైన ముహూర్తం ఖరారు చేసినట్టు తెలిసింది. ఫిబ్రవరి 18వ తేదీన కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు సమాచారం. 
 
ఫిబ్రవరి 18న ఎందుకు అంటే ఆ రోజు రథసప్తమి. హైందవ సంప్రదాయంలో రథసప్తమికి చాలా ప్రత్యేకత ఉంది. దీన్ని సూర్యజయంతి, వైవస్వత మన్వాది అని కూడా పిలుస్తారు. ప్రత్యక్ష భగవానుడు సూర్యుడు పుట్టిన రోజుగా దీనికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఆ రోజు చేపట్టే పనులు దిగ్విజయంగా కొనసాగుతాయని నమ్మకం. అలాంటి రోజున కేటీఆర్‌కు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయడానికి ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం. 
 
ఫిబ్రవరి 18, ఫిబ్రవరి 19న రెండు రోజులు కూడా సప్తమి తిథి ఉంది. ఒకరోజు ఎక్కువ సమయం, మరో రోజు తక్కువ సమయం ఉంది. అలాగే, ఫిబ్రవరి 19వ తేదీన ఛత్రపతి శివాజీ జయంతి. రెండు కలసి వచ్చేలా ఫిబ్రవరి 19న కూడా చేసే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments