Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నగరంలోని శిథిల భవాలను తక్షణమే ఖాళీ చేయించాలి.. కేటీఆర్

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (17:27 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా, ఈ వర్షాల ధాటికి హైదరాబాద్ నగరం అతలాకుతలమైపోతోంది. నగరంలోని నాళాలన్నీ పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైవున్నాయి. 
 
ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. హైదరాబాదు పరిధిలో శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించాలంటూ అధికారులను ఆదేశించారు. పాత భవనాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని, ఆ భవనాల్లో నివసిస్తున్న వారిని తక్షణమే ఖాళీ చేయించాలని స్పష్టం చేశారు. 
 
ప్రాణ నష్టాన్ని నివారించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు పాత భవనాల యజమానులకు వివరించాలని కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. ఈ వర్షాకాలంలో హైదరాబాద్ నగరం అత్యధిక వర్షపాతాన్ని చవిచూసింది. ఈ క్రమంలో పాత భవంతులు కూలిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments