Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్‌లో టెక్కీ దారుణ హత్య.. సెల్లార్‌లో మాటువేసి కత్తులతో నరికేశారు...

హైదరాబాద్‌లో టెక్కీ దారుణ హత్య.. సెల్లార్‌లో మాటువేసి కత్తులతో నరికేశారు...
, సోమవారం, 12 అక్టోబరు 2020 (09:16 IST)
హైదరాబాద్ నగరంలో ఓ టెక్కీ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు ఆయన భార్య తరపు బంధువులకు సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఈ హత్య అమీర్‌పేట్‌లోని ధరమ్ కరణ్ రోడ్డు ఆ టెక్కీ ఉంటున్న అపార్టుమెంట్లోనే జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన కేశన చంద్రశేఖర్ (25), మచిలీపట్టణానికి చెందిన లక్ష్మీగౌరి (22) భార్యాభర్తలు. గతేడాది ఫిబ్రవరి 23న వీరికి వివాహమైంది. 
 
హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న చంద్రశేఖర్ రాజు ఆల్విన్ కాలినీలో భార్యతో కలిసి జీవిస్తుండగా, ఈ యేడాది జూన్ 1న లక్ష్మీగౌరి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
 
భర్త, అత్తమామల వేధింపుల వల్లే లక్ష్మి ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన రాజు ఇటీవలే బెయిలుపై బయటకు వచ్చాడు. 
 
దాంతో రాజు ప్రతి వారం బాలానగర్‌ ఏసీపీ కార్యాలయానికి హాజరు కావాల్సి ఉండడంతో గత 40 రోజులుగా ధరమ్ కరణ్ రోడ్డులోని పద్మశ్రీ అపార్ట్‌మెంట్‌లో నివసించే మేనమామ వద్ద ఉంటున్నాడు.
 
ఈ క్రమంలో ఆదివారం ఉదయం అతడు చికెన్ కోసం అపార్ట్‌మెంట్‌ నుంచి కిందికి వచ్చాడు. అక్కడి సెల్లార్‌లో అప్పటికే మాటువేసిన నలుగురు నిందితులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యవెనక చంద్రశేఖర్ రాజు భార్య లక్ష్మీగౌరి బంధువుల ప్రమేయం ఉండొచ్చని అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫార్మాసిటీ అంటేనే కుంభకోణం: కోమటిరెడ్డి వెంకటరెడ్డి