Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయనే కొనసాగితే తెలంగాణలో కాంగ్రెస్ భూస్థాపితం... కోమటిరెడ్డి

తెలంగాణలో తెలంగాణ పీసీసి అధ్యక్షుడుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగితే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఐదారు సీట్లు కూడా రావనీ, కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోతుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2017 (16:35 IST)
తెలంగాణలో తెలంగాణ పీసీసి అధ్యక్షుడుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగితే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఐదారు సీట్లు కూడా రావనీ, కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోతుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కరడుగట్టిన సమైక్యవాది కిరణ్ కుమార్ రెడ్డికి కుడిభుజం అనీ, అలాంటివాడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా వుంటే ఇక పార్టీ ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. 
 
తనను ఎన్నో అవమానాలకు గురిచేసినా పార్టీ కోసం పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తనను పొమ్మనలేక పొగబెడుతున్నారనీ, ఇదంతా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పుకొచ్చారు. ఉత్తమకుమార్ రెడ్డే 2019 ఎన్నికల దాకా కొనసాగితే తాము పార్టీలో కొనసాగేది లేదని తేల్చి చెప్పారు. తామే కాదు.. చాలామంది కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లిపోతారని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా అధిష్టానం తెలంగాణ పీసీసి అధ్యక్షుడిని మార్చి పార్టీని బతికించుకోవాలని అన్నారు.

సంబంధిత వార్తలు

డీ-హైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేరిన షారూఖ్ ఖాన్..

Rave Party: నేనో ఆడపిల్లను, బర్త్ డే పార్టీ అంటే వెళ్లా, నాకేం తెలియదు: నటి ఆషీరాయ్

హారర్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ గా అదా శర్మ C.D సెన్సార్ పూర్తి

లవ్ మీ చిత్రం రీష్యూట్ నిజమే - అందుకే శనివారం విడుదల చేస్తున్నాం : ఆశిష్

మంచు లక్ష్మి ఆదిపర్వం పై సెన్సార్ ప్రశంస - ఐదు భాషల్లో విడుదల

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments