Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ రెండు చోట్లా ఓడిపోతారు : కిషన్ రెడ్డి

Webdunia
ఆదివారం, 5 నవంబరు 2023 (15:26 IST)
ఈ నెల 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ రెండు స్థానాల్లో ఓడిపోతారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం జరిగింది. ఇందులో ఆయన మాట్లాడుతూ, రేపటి ఎన్నికల్లో ప్రజాగ్రహం ఎలా ఉందో రేపటి ఎన్నికల్లో తెలుస్తుందని తెలిపారు. 
 
అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డిల్లో పోటీ చేస్తున్నారని, ఆయన రెండు చోట్లా ఓడిపోతారని స్పష్టం చేశారు. ప్రజల్లో ఎంతటి ఆగ్రహజ్వాలులు రగులుతున్నాయో రేపటి ఎన్నికల్లో తెలుస్తుందని అన్నారు. తెలంగాణ యువత సునామీలా విజృంభించి బీఆర్ఎస్‌ని పార్టీని తుడిచిపెట్టేస్తుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 
 
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితమే తెలంగాణ అంతటా పునరావృత్తం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, తెలంగాణ ఎన్నికల్లో తాము జనసేనతో కలిసి పోటీ చేస్తున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

35 చిన్న కథ కాదు ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందన్నారు : శ్వాగ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్

ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్... ప్రధాని మోడీకి ధన్యవాదాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments