Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో కిన్లే వాటర్ బాటిల్ 207 రూపాయలా?

Webdunia
శుక్రవారం, 14 జూన్ 2019 (16:48 IST)
మందుబాబులు ఆ బార్‌కు వెళితే..  ప్రతి పెగ్గులోనూ మోసం. బహిరంగ మార్కెట్లో కిన్లే వాటర్ బాటిల్ ధర 20 రూపాయలు కదా? మరి ఆ బాటిల్ ధరను 207కి అమ్ముతున్నారా ? అంటే... అవును అనే సమాధానం వస్తోంది. ఇంతకీ ఈ రేట్లు ఎక్కడంటే హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో ఓ ప్రముఖ బార్ అండ్ రెస్టారెంట్‌లో. 
 
ఆ బార్‌లో కిన్లే వాటర్ బాటిల్ 207 రూపాయలు అమ్ముతున్నారు. ఈ బార్ పైన తూనికలు కొలతల శాఖ అధికారుల దాడులు చేసిన సందర్భంలో ఈ ధరలు చూసి అధికారులే ఆశ్చర్యపోయారు. 20 రూపాయల కిన్లే వాటర్ బాటిల్‌ను 207 రూపాయలకు అమ్మడంతో పాటు, 99 రూపాయల రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్‌ను 209 రూపాయలకు బార్ నిర్వాహకులు అమ్ముతున్నారు. 
 
అంతేకాదు మద్యం ప్రియులు తాగే ప్రతి పెగ్గులోనూ 11 శాతం మందును తక్కువగా సర్వ్ చేస్తున్నట్టు గుర్తించారు అధికారులు. ఈ విధంగా వినియోగదారులు బాగా నష్టపోతున్నారు. అలా మద్యం తాగే మద్యం ప్రియులు చెల్లించే ప్రతి 1336 రూపాయల బిల్లులో 147 రూపాయలు మోసానికి పాల్పడుతున్న వైనాన్ని గుర్తించి, 
బార్ నిర్వాహకులపై మూడు కేసులు నమోదు చేసారు తూనికలు కొలతల శాఖ అధికారులు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments