Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్నీ మిస్సింగ్... వైద్యులే కాజేశారంటూ రోగి బంధువులు...

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (19:31 IST)
కడుపులో నొప్పిగా ఉందని ఆసుపత్రిలో చేరితే చికిత్స పేరుతో వైద్యులు కిడ్నీని కాజేశారంటూ ఓ రోగి బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన హైదరాబాద్ మలక్ పేట యశోద ఆస్పత్రి ముందు చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... శివ ప్రసాద్ గౌడ్ అనే వ్యక్తికి కడుపులో నొప్పిగా ఉండటంతో చికిత్స చేయించుకోవడం కోసం యూఎస్ఏ నుండి వచ్చి మలక్ పేట యశోద ఆసుపత్రిలో చేరారు. 
 
పరీక్ష చేసిన వైద్యులు కడుపులో ట్యూమర్ ఉందని చెప్పారు. శస్త్ర చికిత్స చేసి ట్యూమర్‌ని తీసి శివప్రసాద్ తల్లిదండ్రులకు చూపించారు. అయితే కొద్ది గంటల తర్వాత అతని ఆరోగ్యం మరింత విషమించింది. డాక్టర్లు అతడిని వెంటిలేటర్‌లో ఉంచి చికిత్స అందించారు. అక్కడ పనిచేసే డాక్టర్ ఉమాశంకర్ చెపుతూ...  శివప్రసాద్ శరీరం నుండి ఒక కిడ్నీ తీసివేసి ఉందని తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు.
 
ముందురోజే చికిత్స కోసం పది లక్షలు చెల్లించామనీ, ఇంతలో కిడ్నీ ఎలా మాయమైందని డాక్టర్‌లను నిలదీశారు. మీరే కీడ్నీని దొంగిలించారని వైద్యులపై ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసారు. హాస్పిటల్ వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments