Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్నీ మిస్సింగ్... వైద్యులే కాజేశారంటూ రోగి బంధువులు...

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (19:31 IST)
కడుపులో నొప్పిగా ఉందని ఆసుపత్రిలో చేరితే చికిత్స పేరుతో వైద్యులు కిడ్నీని కాజేశారంటూ ఓ రోగి బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన హైదరాబాద్ మలక్ పేట యశోద ఆస్పత్రి ముందు చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... శివ ప్రసాద్ గౌడ్ అనే వ్యక్తికి కడుపులో నొప్పిగా ఉండటంతో చికిత్స చేయించుకోవడం కోసం యూఎస్ఏ నుండి వచ్చి మలక్ పేట యశోద ఆసుపత్రిలో చేరారు. 
 
పరీక్ష చేసిన వైద్యులు కడుపులో ట్యూమర్ ఉందని చెప్పారు. శస్త్ర చికిత్స చేసి ట్యూమర్‌ని తీసి శివప్రసాద్ తల్లిదండ్రులకు చూపించారు. అయితే కొద్ది గంటల తర్వాత అతని ఆరోగ్యం మరింత విషమించింది. డాక్టర్లు అతడిని వెంటిలేటర్‌లో ఉంచి చికిత్స అందించారు. అక్కడ పనిచేసే డాక్టర్ ఉమాశంకర్ చెపుతూ...  శివప్రసాద్ శరీరం నుండి ఒక కిడ్నీ తీసివేసి ఉందని తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు.
 
ముందురోజే చికిత్స కోసం పది లక్షలు చెల్లించామనీ, ఇంతలో కిడ్నీ ఎలా మాయమైందని డాక్టర్‌లను నిలదీశారు. మీరే కీడ్నీని దొంగిలించారని వైద్యులపై ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసారు. హాస్పిటల్ వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments