మార్కెట్ చరిత్రలోనే ఖమ్మం మిరపకు రికార్డ్

Webdunia
శుక్రవారం, 15 జులై 2022 (15:10 IST)
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిరపకు రికార్డు ధర పలికింది. మార్కెట్ చరిత్రలోనే తొలిసారి క్వింటాలుకు ఏకంగా రూ. 22,800 చొప్పున పలకడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
 
తేజ రకం మిర్చికి అత్యధిక ధర పలుకుతుండడంతో శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసిన సరుకును కూడా తెచ్చి విక్రయిస్తున్నారు. కాగా, ఈ నెల 1న ఏసీ మిరప క్వింటాలుకు రూ.22 వేలు పలకింది. కాగా, మార్కెట్లో నిన్న మిరప కనిష్ఠ ధర రూ. 17,600గా ఉండగా, నమూనా ధర రూ. 20 వేలు పలికింది.
 
అలాగే అల్లిపురానికి చెందిన రావూరి సత్యనారాయణ అనే రైతు ఏసీ రకం మిర్చి పండించాడు. మార్కెట్‌కు ఆయన తీసుకొచ్చిన 22 బస్తాల మిర్చిని క్వింటాలుకు రూ. 22,800 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు.
 
మార్కెట్‌కు మొత్తం 5,546 బస్తాల ఏసీ మిరప బస్తాలు రాగా, ఎండు మిరప 2,058 బస్తాలు, తాలు మిరప 265 బస్తాల సరుకు వచ్చినట్టు మార్కెట్ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

SSRajamouli: వారణాసితో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఇలా వున్నాయంటున్న రాజమౌళి

అనిల్ రావిపూడి తదుపరి ప్రాజెక్టుపై ప్రకటన.. హీరోలు ఎవరంటే...

Anil ravipudi: కళ్యాణ్ రామ్, వెంకటేష్ తో సంక్రాంతి కి వస్తున్నా: అనిల్ రావిపూడి

Virosh Wedding : నేను ఆమెను మిస్ అయ్యానన్న విజయ్.. నీ భార్యగా నేను.. నా భర్తను పరిచయం చేస్తున్నాను.. (Photos)

Sri Vishnu: గ్రహాలని, జాతకాలలో కొన్నింటినే ఫాలో అవుతా : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?

తులసి రసంతో తేనెను కలిపి తీసుకుంటే ఏమవుతుంది?

మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

సీజనల్ వ్యాధులను దరిచేరకుండా చేసే సూప్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments