Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా కెసిఆర్‌‌కు ఆ కళ వచ్చేసిందని తెలంగాణ ప్రజలు చెప్పుకుంటున్నారా?

బిజెపికి, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు చేస్తానంటూ రాష్ట్రాలు పట్టుకుని తిరుగుతున్న తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అప్పుడే ప్రధానమంత్రి కళ వచ్చేసినట్లుంది. తెలంగాణా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రైతుబంధు పథకానికి సం

Webdunia
శుక్రవారం, 11 మే 2018 (15:05 IST)
బిజెపికి, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు చేస్తానంటూ రాష్ట్రాలు పట్టుకుని తిరుగుతున్న తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అప్పుడే ప్రధానమంత్రి కళ వచ్చేసినట్లుంది. తెలంగాణా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రైతుబంధు పథకానికి సంబంధించి పత్రికలకు ఇచ్చిన ప్రకటనలను చూస్తే కెసిఆర్ దేశ ప్రజలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. రైతులకు పంటల సాగుకోసం యేడాదికి 8 వేల రూపాయలు ఇచ్చే రైతు బంధు పథకాన్ని ప్రవేశపెడుతున్న కెసిఆర్ దాన్ని దేశ వ్యాప్తంగా ప్రచారం చేసుకుంటున్నారు.
 
తెలుగు పత్రికలకు రెండు పేజీలు పూర్తి ప్రకటనలు ఇచ్చిన ఆయన తమిళనాడు, కర్ణాటక, కేరళ, బెంగాళ్ ఇలా ఏ రాష్ట్రాన్ని విడిచిపెట్టకుండా భారీ ప్రకటనలు ఇచ్చారు. దేశ రైతాంగానికి స్వర్ణయుగం అనే శీర్షికతోనే ఈ ప్రకటనలు వచ్చాయి. తెలంగాణా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ పథకం దేశంలోని అన్ని రాష్ట్రాలూ అమలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని రాజకీయ విశ్లేషకులు చలోక్తులు విసురుకుంటున్నారు. 
 
తను ప్రధానమంత్రి అయితే ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టగలమని దేశ ప్రజలకు చెప్పడం కావచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తను భవిష్యత్తులో చేయబోతున్న ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలకు దీన్ని అవకాశంగా ఉపయోగించుకున్నారు. ఈ ప్రకటనల్లో కెసిఆర్ ఫోటో తప్ప వ్యవసాయమంత్రి ఫోటో కూడా లేదు. దీనికి కారణం దేశ వ్యాప్తంగా కెసిఆర్ ఫోకస్ కావాలనుకోవడమే కావచ్చట. ఏమైనా అప్పుడే కెసిఆర్‌లో ప్రధానమంత్రి కళ వచ్చేసిందంటూ తెలంగాణా రాష్ట్ర ప్రజలు మాట్లాడేసుకుంటున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments