Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుజూర్‌నగర్‌పై కేసీఆర్ వరాల జల్లు

Webdunia
శనివారం, 26 అక్టోబరు 2019 (18:00 IST)
హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఊహించని మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో.. నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు.

ప్రతి గ్రామపంచాయతీకి రూ. 20 లక్షల నిధులిస్తామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. ఒక్కో మండల కేంద్రానికి రూ. 30 లక్షలు ఇస్తామని అలాగే.. రోడ్ల అభివృద్ధికి రూ. 25 కోట్లు మంజూరు చేస్తామన్నారు. నేరేడుచెర్ల మున్సిపాలిటీకి రూ. 15 కోట్లు ఇస్తామని కేసీఆర్ ఈ సభాముఖంగా చెప్పారు.
 
‘ఈ విజయం మాలో ఉత్సాహాన్ని పెంచుతుంది. హుజూర్‌నగర్‌లో కల్వర్టులు నిర్మిస్తాం. సైదిరెడ్డి నాయకత్వంలోనే హుజూర్‌నగర్ అభివృద్ధి. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో సీఎం ప్రత్యేక నిధి నుంచి హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో రెసిడెన్షియల్‌ స్కూల్‌ మంజూరు చేస్తాం.

నియోజకవర్గంలో బంజారాభవన్‌ను కూడా నిర్మిస్తాం. హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌లో పోడుభూముల సమస్యను పరిష్కరిస్తాం. హుజూర్‌నగర్‌కు రెవెన్యూ డివిజన్‌ మంజూరు చేస్తాం. ఈఎస్‌ఐ ఆస్పత్రి, పాలిటెక్నిక్‌ కాలేజీని ఏర్పాటు చేస్తాం.

హుజూర్‌నగర్‌లో కోర్టును కూడా ఏర్పాటు చేస్తాం. భారీగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు మంజూరు చేస్తాం. ప్రతిపక్షాలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడాయి. 1997లో ఎన్టీఆర్‌ హయాంలో కరవు మంత్రిగా పనిచేశాను. నల్గొండ ఇన్‌ఛార్జ్‌గా కూడా పనిచేశాను’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

Vijay: విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్‌ లో గ్రే షేడ్స్‌ తో డా. రాజశేఖర్

Chiru: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలలో మిస్టరీ కొనసాగుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments