కెమికల్ సేవించి చిన్నారి మృత్యువాత

Webdunia
ఆదివారం, 3 అక్టోబరు 2021 (10:51 IST)
తెలంగాణాలోని కామారెడ్డి జిల్లాలో ఓ విషాదకర ఘటన సంభవించింది. అభంశుభం తెలియని చిన్నారి ఒకరు రసాయనం తాగి మృత్యువాతపడింది. ఈ హృదయ విదారక సంఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలం రాచూర్‌లో చోటుచేసుకుంది. 
 
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జ్యోతిక - సూర్యకాంత్‌ దంపతుల పెద్ద కుమార్తె అదిత్య(5) శనివారం అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చింది. ఆ సమయంలో గదిలో ఉన్న రసాయనం తాగి స్పృహ తప్పి పడిపోయింది. కొంతసేపటికి గమనించిన కేంద్రం నిర్వాహకురాలు నగరబాయి.. పాపను చిన్నారి ఇంటికి తీసుకువెళ్లింది. 
 
ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు మహారాష్ట్రలోని దెగ్లూర్‌ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి నిజామాబాద్‌కు తరలించారు. మార్గమధ్యంలో అదిత్య మృతి చెందింది. ఈ విషయంపై సీడీపీవో సునందను సంప్రదించగా చిన్నారి మృతి చెందినట్లు సమాచారం అందిందని, పూర్తి వివరాలు తెలుసుకుంటామని సమాధానమిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

తర్వాతి కథనం
Show comments