Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెమికల్ సేవించి చిన్నారి మృత్యువాత

Webdunia
ఆదివారం, 3 అక్టోబరు 2021 (10:51 IST)
తెలంగాణాలోని కామారెడ్డి జిల్లాలో ఓ విషాదకర ఘటన సంభవించింది. అభంశుభం తెలియని చిన్నారి ఒకరు రసాయనం తాగి మృత్యువాతపడింది. ఈ హృదయ విదారక సంఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలం రాచూర్‌లో చోటుచేసుకుంది. 
 
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జ్యోతిక - సూర్యకాంత్‌ దంపతుల పెద్ద కుమార్తె అదిత్య(5) శనివారం అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చింది. ఆ సమయంలో గదిలో ఉన్న రసాయనం తాగి స్పృహ తప్పి పడిపోయింది. కొంతసేపటికి గమనించిన కేంద్రం నిర్వాహకురాలు నగరబాయి.. పాపను చిన్నారి ఇంటికి తీసుకువెళ్లింది. 
 
ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు మహారాష్ట్రలోని దెగ్లూర్‌ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి నిజామాబాద్‌కు తరలించారు. మార్గమధ్యంలో అదిత్య మృతి చెందింది. ఈ విషయంపై సీడీపీవో సునందను సంప్రదించగా చిన్నారి మృతి చెందినట్లు సమాచారం అందిందని, పూర్తి వివరాలు తెలుసుకుంటామని సమాధానమిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments