ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కేసు: కోర్టుకు హాజరైన మాజీ ఎంపీ కవిత

Webdunia
గురువారం, 27 ఫిబ్రవరి 2020 (13:37 IST)
MP kavita
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసు విషయంలో నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానంలో స్పెషల్ సెషన్స్ జడ్జి ముందు మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హాజరయ్యారు. 2010లో జరిగిన నిజామాబాద్ అర్బన్ ఉపఎన్నికల సందర్భంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత ధర్నా నిర్వహించారు. 
 
తెలంగాణ రాష్ట్రానికి మద్దతుగా అప్పటి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ రాజీనామా చేసిన సందర్భంగా తదనంతరం జరిగిన ఉపఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారులకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, నిజామాబాద్ పట్టణంలో ఆందోళనలు నిర్వహించారు. 
 
అయితే సెక్షన్ 30 యాక్ట్ అమలులో ఉన్నప్పుడు నిజామాబాద్ ఎస్పీ ఆఫీసు ఎదురుగా ధర్నా చేసిన కారణంగా ఐపీసీ 341, 188, సెక్షన్లు కింద పోలీసులు కేసును నమోదు చేశారు. ఈ మేరకు నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం, స్పెషల్ సెషన్స్ జడ్జి ముందు హాజరు కావాలంటూ ఇటీవల సమన్లు జారీ చేసింది. 
 
కేసును విచారించిన మొదటి అదనపు న్యాయమూర్తి, వ్యక్తిగత పూచీకత్తు పదివేల రూపాయలు బాండ్ సమర్పించాలని, తిరిగి 19మార్చ్ నాడు హాజరు కావాలని న్యాయమూర్తి  ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments