Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో జనగామ బాలుడు మృతి.. మద్యంమత్తులో మహిళ వీరంగం

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (08:47 IST)
అమెరికాలో తెలంగాణ రాష్ట్రంలోని జనగామ ప్రాంతానికి చెందిన 13 యేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. యూఎస్‌లో లాస్‌ఏంజెలెస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బాలుడు ప్రాణాలు కోల్పోగా, అతని కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, లింగాలఘనపురం మండలం, బండ్లగూడేనికి చెందిన రామచంద్రారెడ్డి అనే వ్యక్తి కుటుంబం గత 16 యేళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. ఈయన సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఈయన తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. 
 
ఈ వేడుకలు ముగిసిన తర్వాత ఇంటికి బయలుదేరారు. లాస్‌ఏంజెలెస్‌ నగరంలోని ఓ ట్రాఫిక్ సిగ్నెల్ వద్ద కారు ఆగారు. ఆ సమయంలో మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చిన ఓ మహిళ వెనుక నుంచి రామచంద్రారెడ్డి కారును బలంగా ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో వెనుకసీట్ల ఉన్న 13 యేళ్ల కుమారుడు అర్జిత్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో రామచంద్రారెడ్డితో పాటు భార్య రజనీ రెడ్డి, కుమార్తె అక్షితా రెడ్డి (15)లు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. యూఎస్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments