Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో జనగామ బాలుడు మృతి.. మద్యంమత్తులో మహిళ వీరంగం

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (08:47 IST)
అమెరికాలో తెలంగాణ రాష్ట్రంలోని జనగామ ప్రాంతానికి చెందిన 13 యేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. యూఎస్‌లో లాస్‌ఏంజెలెస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బాలుడు ప్రాణాలు కోల్పోగా, అతని కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, లింగాలఘనపురం మండలం, బండ్లగూడేనికి చెందిన రామచంద్రారెడ్డి అనే వ్యక్తి కుటుంబం గత 16 యేళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. ఈయన సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఈయన తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. 
 
ఈ వేడుకలు ముగిసిన తర్వాత ఇంటికి బయలుదేరారు. లాస్‌ఏంజెలెస్‌ నగరంలోని ఓ ట్రాఫిక్ సిగ్నెల్ వద్ద కారు ఆగారు. ఆ సమయంలో మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చిన ఓ మహిళ వెనుక నుంచి రామచంద్రారెడ్డి కారును బలంగా ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో వెనుకసీట్ల ఉన్న 13 యేళ్ల కుమారుడు అర్జిత్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో రామచంద్రారెడ్డితో పాటు భార్య రజనీ రెడ్డి, కుమార్తె అక్షితా రెడ్డి (15)లు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. యూఎస్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments