Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డే.. ఇందులో ఎలాంటి మార్పు లేదు: నాయిని

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (11:52 IST)
తెలంగాణ మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వచ్చే ఏడాది రానున్న ఎన్నికల్లో వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి గెలిచి.. సీఎం పీఠంపై కూర్చుంటారన్నారు. ఎన్నికల తర్వాత ఏపీలో తెలుగుదేశం పార్టీకి చిరునామా గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. కేసీఆర్‌ను గద్దె దించాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోవని తెలిపారు. 
 
కేసీఆర్‌ను ఓడించడం ఎవరితరమూ కాదన్నారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన పార్టీలతో టీఆర్ఎస్‌ను పోల్చి చూస్తే.. ఎవరు బాగా పాలించారో తెలుస్తుందని చెప్పారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నది ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వమేనని నాయిని గుర్తు చేశారు.
 
ఇదిలా ఉంటే... తెలంగాణ ఎన్నికల్లో భాగంగా ఆ రాష్ట్ర ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ప్రచారం స్పీడ్ పెంచారు. ఏకంగా ఎనిమిది సభల్లో బుధవారం పాల్గొననున్నారు. జాన్సువాడ, జుక్కల్, నారాయణ్ ఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి ఆందోల్, నర్సాపూర్ సభల్లో ప్రసంగించనున్నారు. ఆపై సాయంత్రం తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

AI : సినిమాల్లో ఎ.ఐ. వాడకం నష్టమే కల్గిస్తుంది : అల్లు అరవింద్, ధనుష్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments