Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుజనా చౌదరిపై ఐటీ దాడులు.. అంతా మోదీ మాయే- చంద్రబాబు

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (11:20 IST)
తెలుగుదేశం పార్టీ ఎంపీ సుజనా చౌదరిపై ఈడీ, ఐటీ దాడులపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. సుజనాపై ఈడీ, ఐటీ దాడులు బీజేపీ రాజకీయ కక్ష సాధింపునకు పరాకాష్టని చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతోనే ఇవన్నీ జరుగుతున్నాయని ఆరోపించారు. తెలంగాణకు జరిగే ఎన్నికల్లో ప్రజా కూటమి గెలుపు చారిత్రక అవసరమని చెప్పారు. 
 
విడిపోయిన వేళ ధనిక రాష్ట్రంగా వున్న తెలంగాణ, ప్రస్తుతం అప్పుల్లో కూరుకుపోయేందుకు కేసీఆర్ విధానాలే కారణమని చంద్రబాబు విమర్శించారు. ఐదువేల రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. పట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపునిచ్చారు. 
 
ఇదిలా ఉంటే.. తెలంగాణ ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన నందమూరి సుహాసినికి మద్దతుగా తారకరత్న రంగంలోకి దిగారు. తన సోదరిని గెలిపించాలని కోరుతూ.. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేశారు. 
 
ఈ ఎన్నికల్లో ప్రజా కూటమి విజయం సాధిస్తేనే రాష్ట్ర ప్రజలకు మేలు కలుగుతుందని చెప్పారు. సుహాసిని గెలిస్తే, ఈ ప్రాంతంలో సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments