Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోతిని బెదరగొట్టాలనుకున్నాడు.. ఇనుప రాడ్ విద్యుత్ వైర్లకు తగిలి..?

Webdunia
గురువారం, 31 డిశెంబరు 2020 (16:34 IST)
కోతిని బెదరగొట్టేందుకు ప్రయత్నించి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కూకట్‌పల్లి జయనగర్‌లో నివాసం ఉంటున్న లోకేశ్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. 
 
కరోనా లాక్‌డౌన్ అప్పటి నుంచి అతడు ఇంటి వద్ద నుంచే విధులు నిర్వర్తిస్తున్నాడు. వర్క్ ఫ్రం హోమ్‌ చేస్తున్న లోకేశ్.. మంగళవారం మధ్యాహ్నం రెండో ఫ్లోర్‌లో ఉన్న తన ఇంట్లోకి కోతులు రావడం గమనించాడు. కోతులు ఇంట్లోకి ప్రవేశించకుండా వాటిని బెదరగొట్టే ప్రయత్నం చేశాడు. ఇనుప రాడుతో వాటిని అక్కడి నుంచి తరిమేయడం మొదలుపెట్టాడు.
 
ఈ క్రమంలోనే లోకేశ్ చేతిలో ఉన్న ఇనుపరాడ్‌ ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లకు తగిలి.. షాక్ కొట్టింది. ఇది గమనించి కుటుంబ సభ్యులు వెంటనే లోకేశ్‌ను సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి చేరుకునేలోపే లోకేశ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments