జియో కస్టమర్లకు గుడ్ న్యూస్.. మళ్లీ ఉచిత వాయిస్‌ కాల్స్‌ సేవలు

Webdunia
గురువారం, 31 డిశెంబరు 2020 (16:19 IST)
కొత్త సంవత్సరం ఆరంభం కాకముందే ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో మళ్లీ ఉచిత వాయిస్‌ కాల్స్‌ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. జనవరి నుంచి ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా కాల్స్‌ చేసుకోవచ్చునని ప్రకటించింది. 
 
డిసెంబర్ 31తో ఐయూసీ అమలు గడువు ముగుస్తుండటంతో జియో మళ్లీ ఉచిత వాయిస్‌ కాల్స్‌ అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఐయూసీ విధానం రద్దయిన తర్వాత మళ్లీ ఉచిత వాయిస్‌ కాల్స్‌ సేవలను పునరుద్ధరిస్తామని గతంలో చెప్పినట్లు జియో ప్రకటించింది. 1, 2021 నుంచి ఏ నెట్‌వర్క్‌కైనా జియో ద్వారా ఉచిత వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు అని ప్రకటించింది. 
 
అయితే ఒక నెట్‌వర్క్‌ నుంచి మరో మొబైల్ నెట్‌వర్క్‌కు ఫోన్ చేసినప్పుడు ఇన్ కమింగ్ నెట్‌వర్క్‌కు కాల్‌ చేసిన నెట్‌వర్క్‌ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ ఛార్జెస్‌ అంటారు. ఈ విధానాన్ని జనవరి 1 2020 నుంచి తొలగించడానికి కేంద్రం సమ్మతించింది. అయితే ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా దీన్ని వ్యతిరేకించడంతో పొడగిస్తూ 2019 సెప్టెంబరులో ట్రాయ్‌ ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments