Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిగా బాధ.. కానీ, దేశం కోసం అమరుడు కావడం సంతోషంగా వుంది...

Webdunia
మంగళవారం, 16 జూన్ 2020 (21:59 IST)
భారత్ - చైనా బలగాల మధ్య సరిహద్దు ఘర్షణలు చెలరేగాయి. లడఖ్ సమీపంలోని గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణల్లో భారత సైన్యానికి చెందిన కల్నల్ అధికారితో పాటు.. మరో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. గత రాత్రి జరిగిన ఈ ఘటనలో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన బి.సంతోష్ అనే కల్నల్ ర్యాంకు అధికారి కూడా మృతి చెందారు. 
 
బి. సంతోష్ బాబు తల్లిదండ్రులు సూర్యాపేటలో నివసిస్తుంటే, సంతోష్ కుటుంబం మాత్రం ఢిల్లీలో ఉంటున్నారు. ఈ క్రమంలో తన కుమారుడి మరణవార్తపై సూర్యాపేటలో ఉన్న ఆయన తల్లి మంజుల స్పందించారు. తనకు ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారని, ఆ ఒక్క కొడుకూ ఇప్పుడు అమరుడయ్యాడని ఆమె అన్నారు. 
 
తల్లిగా బిడ్డను కోల్పోయిన బాధ ఉన్నా, తన కుమారుడు దేశం కోసం ప్రాణాలు అర్పించడం పట్ల గర్వంగా వుందని పుట్టెడు దుఃఖాన్ని భరిస్తూ నిబ్బరంగా చెప్పారు. నిజానికి తన కుమారుడు చనిపోయాడన్న వార్త తన కోడలికి సోమవారం రాత్రే చెప్పారని, కానీ, తాను తట్టుకోలేనని మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు చెప్పారని కన్నీటిని పంటి బిగువున పెట్టి వివరించింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments