Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిగా బాధ.. కానీ, దేశం కోసం అమరుడు కావడం సంతోషంగా వుంది...

Webdunia
మంగళవారం, 16 జూన్ 2020 (21:59 IST)
భారత్ - చైనా బలగాల మధ్య సరిహద్దు ఘర్షణలు చెలరేగాయి. లడఖ్ సమీపంలోని గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణల్లో భారత సైన్యానికి చెందిన కల్నల్ అధికారితో పాటు.. మరో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. గత రాత్రి జరిగిన ఈ ఘటనలో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన బి.సంతోష్ అనే కల్నల్ ర్యాంకు అధికారి కూడా మృతి చెందారు. 
 
బి. సంతోష్ బాబు తల్లిదండ్రులు సూర్యాపేటలో నివసిస్తుంటే, సంతోష్ కుటుంబం మాత్రం ఢిల్లీలో ఉంటున్నారు. ఈ క్రమంలో తన కుమారుడి మరణవార్తపై సూర్యాపేటలో ఉన్న ఆయన తల్లి మంజుల స్పందించారు. తనకు ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారని, ఆ ఒక్క కొడుకూ ఇప్పుడు అమరుడయ్యాడని ఆమె అన్నారు. 
 
తల్లిగా బిడ్డను కోల్పోయిన బాధ ఉన్నా, తన కుమారుడు దేశం కోసం ప్రాణాలు అర్పించడం పట్ల గర్వంగా వుందని పుట్టెడు దుఃఖాన్ని భరిస్తూ నిబ్బరంగా చెప్పారు. నిజానికి తన కుమారుడు చనిపోయాడన్న వార్త తన కోడలికి సోమవారం రాత్రే చెప్పారని, కానీ, తాను తట్టుకోలేనని మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు చెప్పారని కన్నీటిని పంటి బిగువున పెట్టి వివరించింది. 

 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments