Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశాల నుంచి వస్తే.. 14 రోజులు ఇంట్లోనే..ఎక్కడ?

Webdunia
ఆదివారం, 8 మార్చి 2020 (12:14 IST)
కరోనా (కొవిడ్‌-19) నియంత్రణ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. విదేశాల నుంచి వచ్చే వారు వ్యాధి లక్షణాలు లేకున్నా, 14 రోజుల పాటు ఇంటి వద్దే ఉండాలని ఆదేశించింది.

ఆ తర్వాత పరీక్షలు చేశాకే వారు బయటకు రావాల్సి ఉంటుంది. ఈ దిశగా వైద్య ఆరోగ్య శాఖను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వైరస్‌ సోకినా 14 రోజుల తర్వాతే వ్యాధి లక్షణాలు బయటపడతాయన్న అంచనాతో విదేశాల నుంచి వచ్చే వారు 14 రోజుల పాటు ఇంటి వద్దే ఉండాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది.

అనుమానితుల చికిత్సలోనూ మార్పులు చేస్తున్నారు. విదేశాల నుంచి వ్యాధి లక్షణాలతో వచ్చిన వారిని, ఎలాంటి లక్షణాలు లేని వారిని వేర్వేరు చోట్ల ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశించారు.

కేసులు లేవని తేలిగ్గా తీసుకోవద్దు రాష్ట్రంలో కేసులు లేవని తేలిగ్గా తీసుకోవద్దని, అప్రమత్తంగానే ఉండాలని మంత్రి ఈటల వైద్యాధికారులను కోరారు. ఆయన శనివారం పరిస్థితిని సమీక్షించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో కూడా మాట్లాడారు.

గాంధీ ఆసుపత్రిలోని ఏడో అంతస్తులో ఉన్న కరోనా వార్డుల్లోకి ఇతరులను అనుమతించవద్దని సూచించారు. బాధితుల్లో ఐటీ ఉద్యోగులు, ప్రముఖ బాధ్యతలు కలిగిన వారు ఉంటున్నందున వారి పనులకు ఇబ్బంది లేకుండా అవసరమైతే వైఫై సౌకర్యం కల్పించాలని సూచించారు.

వైద్యశాఖలోని అన్ని స్థాయుల అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments