Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుటుంబ కలహాలతో విసుగు.. భర్తను ఇంట్లో పెట్టి తాళం వేసి.. బిడ్డతో పాటు..?

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (20:46 IST)
క్షణికావేశాలు నేరాలకు ఘోరాలకు దారితీస్తున్నాయి. మహిళలపై ఓవైపు అకృత్యాలు పెచ్చరిల్లిపోతుంటే.. మరోవైపు గృహ హింస కూడా మానసిక ఆవేదనకు కారణమవుతున్నాయి. తాజాగా కుటుంబ సమస్యలతో విసిగివేసారిన ఓ మహిళ భర్తను ఇంట్లో తాళం వేసి తన 8 నెలల కూతురుతో సహా భవనం పైనుంచి దూకింది. 
 
హైదరాబాదు నగరంలోని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12లో సోమవారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషాదంలో మహిళ చనిపోగా శిశువు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌కు చెందిన బిస్మల్‌ సింగ్‌, అనిత(24) ఇరువురు దంపతులు. గడిచిన మూడు నెలలుగా బంజారాహిల్స్‌ పరిధి శ్రీనగర్‌ కాలనీలో నివాసముంటున్నారు. కాగా దంపతులిద్దరూ తరచుగా గొడవపడుతుండేవారు. బంధువులు వచ్చి సయోధ్య కుదిర్చి వెళ్తుండేవారు.
 
సోమవారం కూడా ఇలాగే ఇరువురి మధ్య వివాదం తలెత్తింది. దీంతో భర్తను అనిత ఇంట్లో తాళం వేసి భవనం రెండో అంతస్థు బాల్కనీ నుండి తన చంటి బిడ్డతో సహా దూకింది. చుట్టుప్రక్కలవారు, స్థానికులు వెంటనే ఇరువురిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అనిత చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంజారాహిల్స్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ కె. ఉదయ్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments