Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుటుంబ కలహాలతో విసుగు.. భర్తను ఇంట్లో పెట్టి తాళం వేసి.. బిడ్డతో పాటు..?

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (20:46 IST)
క్షణికావేశాలు నేరాలకు ఘోరాలకు దారితీస్తున్నాయి. మహిళలపై ఓవైపు అకృత్యాలు పెచ్చరిల్లిపోతుంటే.. మరోవైపు గృహ హింస కూడా మానసిక ఆవేదనకు కారణమవుతున్నాయి. తాజాగా కుటుంబ సమస్యలతో విసిగివేసారిన ఓ మహిళ భర్తను ఇంట్లో తాళం వేసి తన 8 నెలల కూతురుతో సహా భవనం పైనుంచి దూకింది. 
 
హైదరాబాదు నగరంలోని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12లో సోమవారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషాదంలో మహిళ చనిపోగా శిశువు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌కు చెందిన బిస్మల్‌ సింగ్‌, అనిత(24) ఇరువురు దంపతులు. గడిచిన మూడు నెలలుగా బంజారాహిల్స్‌ పరిధి శ్రీనగర్‌ కాలనీలో నివాసముంటున్నారు. కాగా దంపతులిద్దరూ తరచుగా గొడవపడుతుండేవారు. బంధువులు వచ్చి సయోధ్య కుదిర్చి వెళ్తుండేవారు.
 
సోమవారం కూడా ఇలాగే ఇరువురి మధ్య వివాదం తలెత్తింది. దీంతో భర్తను అనిత ఇంట్లో తాళం వేసి భవనం రెండో అంతస్థు బాల్కనీ నుండి తన చంటి బిడ్డతో సహా దూకింది. చుట్టుప్రక్కలవారు, స్థానికులు వెంటనే ఇరువురిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అనిత చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంజారాహిల్స్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ కె. ఉదయ్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments