Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుటుంబ కలహాలతో విసుగు.. భర్తను ఇంట్లో పెట్టి తాళం వేసి.. బిడ్డతో పాటు..?

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (20:46 IST)
క్షణికావేశాలు నేరాలకు ఘోరాలకు దారితీస్తున్నాయి. మహిళలపై ఓవైపు అకృత్యాలు పెచ్చరిల్లిపోతుంటే.. మరోవైపు గృహ హింస కూడా మానసిక ఆవేదనకు కారణమవుతున్నాయి. తాజాగా కుటుంబ సమస్యలతో విసిగివేసారిన ఓ మహిళ భర్తను ఇంట్లో తాళం వేసి తన 8 నెలల కూతురుతో సహా భవనం పైనుంచి దూకింది. 
 
హైదరాబాదు నగరంలోని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12లో సోమవారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషాదంలో మహిళ చనిపోగా శిశువు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌కు చెందిన బిస్మల్‌ సింగ్‌, అనిత(24) ఇరువురు దంపతులు. గడిచిన మూడు నెలలుగా బంజారాహిల్స్‌ పరిధి శ్రీనగర్‌ కాలనీలో నివాసముంటున్నారు. కాగా దంపతులిద్దరూ తరచుగా గొడవపడుతుండేవారు. బంధువులు వచ్చి సయోధ్య కుదిర్చి వెళ్తుండేవారు.
 
సోమవారం కూడా ఇలాగే ఇరువురి మధ్య వివాదం తలెత్తింది. దీంతో భర్తను అనిత ఇంట్లో తాళం వేసి భవనం రెండో అంతస్థు బాల్కనీ నుండి తన చంటి బిడ్డతో సహా దూకింది. చుట్టుప్రక్కలవారు, స్థానికులు వెంటనే ఇరువురిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అనిత చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంజారాహిల్స్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ కె. ఉదయ్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments