Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువకుడితో ప్రేమ.. తాగి యువతి ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (13:45 IST)
యువకుడితో ప్రేమాయణం ఓ యువతి ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళితే.. సత్తుపల్లి మండలం నారాయణపురానికి చెందిన అలవాల ప్రత్యూష (18) హైదరాబాద్‌లో ప్రైవేట్ జాబ్ చేస్తోంది. ప్రత్యూష తన అమ్మమ్మ వారింటికి అప్పుడప్పుడు వెళ్తూ ఉండేది. 
 
అమ్మమ్మ ఇంటిపక్కన ఉండే జగదీష్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆమెకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమించానని చెప్పాడు. ఇద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఇద్దరు ప్రతిరోజు ఫోన్‌లో మాట్లాడుకునేవారు. 
 
ప్రేమ పరిచయం ఏర్పడిన ఎనిమిది నెలల తరువాత తాను పెళ్లి చేసుకోనని చెప్పడంతో ప్రత్యూష మనస్తాపానికి గురైంది. ఏప్రిల్ 30న హైదరాబాద్‌లో శానిటైజర్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె కుటుంబ సభ్యులు ప్రియుడు జగదీష్ కారణంగానే చనిపోయిందని బషీర్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
 
ప్రత్యూష మృతదేహంతో సత్తుపల్లి మండలం తంబూరు గ్రామంలో జగదీష్ ఇంటి ముందు ఆమె బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో జగదీష్ తల్లిదండ్రులు ఇంటి నుంచి పారిపోయారు. ఎస్‌ఐ నరేష్ అక్కడికి చేరుకొని కేసు నమోదు చేశామని దర్యాప్తు చేస్తున్నామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమింపజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments