Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్ మ్యాప్స్ ప్రకారం బైకును నడిపాడు.. ప్రాణాలు కోల్పోయిన టెక్కీ

Webdunia
సోమవారం, 15 మే 2023 (09:31 IST)
హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ టెకీ దుర్మరణం పాలయ్యాడు. గూగుల్ మ్యాప్స్ ఫాలో అవతూ వెళ్లిన అతడు తప్పుడు మార్గంలో వెళ్తున్నట్లు గుర్తించి వెనక్కి మళ్లిన సమయంలో మెహిదీపట్నం-శంషాబాద్ ఎక్స్‌ప్రెస్ మార్గంలో పిల్లర్ నంబర్ 84 వద్ద శనివారం అర్ధరాత్రి ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో టెకీ చరణ్ (22) మృతి చెందాడు. వాహనం వెనక కూర్చున్న ఇద్దరు యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 
 
కృష్ణాజిల్లా చిన్నగొల్లపాలెం గ్రామానికి చెందిన చరణ్ నగరంలోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. వీకెండ్ కావడంతో అతడు తన స్నేహితులతో కలిసి శనివారం సాయంత్రం బైకులపై షికారుకు బయల్దేరాడు. తొలుత నూతన సచివాలయం, అంబేద్కర్ విగ్రహం చూశాక వారు ట్యాంక్‌బండ్‌పై సేద తీరారు. ఆ తరువాత గూగుల్‌ మ్యాప్స్ సాయంతో మెహిదీపట్నం నుంచి కేబుల్ బ్రిడ్జి వైపు బయలుదేరారు.
 
గూగుల్ మ్యాప్స్ ప్రకారం బైకును నడిపాడు. గచ్చిబౌలి వెళ్లేందుకు పిల్లర్ నంబర్ 82 వద్ద ఎక్స్‌ప్రెస్ వే నుంచి ర్యాంపు ద్వారా కిందకు దిగేందుకు మలుపు తిరిగాడు. ఈ క్రమంలోనే ఆరాంఘర్ వైపు నుంచి వస్తున్న కారు ఈ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన టెక్కీ ఆదివారం చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. 

సంబంధిత వార్తలు

బెంగుళూరు రేవ్ పార్టీలో తన పేరు రావటం పై జానీమాస్టర్ వివరణ..

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments