Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భాగ్య నగరికి సోనియమ్మ... హైదరాబాద్‌లో గాంధీ ఐడియాలజీ సెంటర్

sonia gandhi
, శుక్రవారం, 12 మే 2023 (08:48 IST)
కాంగ్రెస్ పూర్వ అధ్యక్షురాలు సోనియా గాంధీ హైదరాబాద్ నగరానికి రానున్నారు. భాగ్యనగరిలోని బోవెన్‌పల్లిలో నిర్మించే గాంధీ ఐడియాలజీ సెంటర్ భవన నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేస్తారు. ఈ భవన నిర్మాణానికి వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి పది ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇపుడు అదేస్థలంలో గాంధీ ఐడియాలజీ సెంటర్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సెంటర్ నిర్మాణానికి కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కూడా అనుమతి ఇచ్చింది. 
 
ఆ స్థలంలో గాంధీ ఐడియాలజీ సెంటర్ భవన నిర్మాణానికి అనుమతి కోరుతూ పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి కంటోన్మెంట్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి బుధవారం అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో నిర్మాణ పనులను ప్రారంభించాలని పీసీసీ నిర్ణయించింది. ఈ భవనంలో గాంధీ భావజాలాన్ని తెలిపే లైబ్రరీతో పాటు పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను వీక్షించేలా ఒక థియేటర్, గాంధీ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నగరానికి వచ్చినపుడు అక్కడ బస చేసేలా ఏర్పాట్లు ఉంటాయి. 
 
అలాగే, ఏఐసీసీ అధ్యక్షుడికి ప్రత్యేక చాంబర్, పార్టీ రాష్ట్ర, జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేలా ఈ భవన నిర్మాణం చేపట్టనున్నారు. ఈ భవన నిర్మాణ శంకుస్థాపనకు సోనియా గాంధీతో పాటు ఆమె తనయుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఇతర ముఖ్య నేతలు కూడా హాజరుకానున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గిరక తాటి చెట్టు ఎక్కి కల్లు తీసిన మంత్రి ఎర్రబెల్లి ...