Webdunia - Bharat's app for daily news and videos

Install App

పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు ఆఫీసులో మద్యం సేవించవచ్చు..

Webdunia
సోమవారం, 15 మే 2023 (09:02 IST)
హర్యానా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు ఆఫీసులో మద్యం సేవించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, హర్యానా రాష్ట్రంలోని కార్పొరేట్ ఉద్యోగులకు మాత్రం ఇప్పుడీ అవకాశం వచ్చేసింది. ఇక నుంచి అక్కడి కార్పొరేట్ ఉద్యోగులు ఆఫీసులోనే సరదాగా తమ సహచర ఉద్యోగులతో కలిసి చీర్స్ చెప్పి పెగ్గుల మీద పెగ్గులు లాగించొచ్చు! 
 
తక్కువ మోతాదు ఆల్కహాల్ ఉండే బీర్, వైన్ వంటి డ్రింకులను కార్యాలయాల్లోకి అనుమతిస్తూ హర్యానా సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా 2023-24 సంవత్సరానికిగానూ రూపొందించిన లిక్కర్ పాలసీలో కీలక మార్పులు చేసింది. అలా అని అన్ని ఆఫీసుల్లోనూ మద్యానికి అనుమతి ఉండదు. 
 
ఆఫీసులో కనీసం 5 వేల మంది ఉద్యోగులు ఉండాలి. అంతేనా.. లక్ష చదరపుటడుగుల విస్తీర్ణానికి తక్కువ కాకుండా కార్యాలయ ప్రాంగణం ఉండాలి. అలాగే కనీసం  రెండు వేల ఫీట్లతో క్యాంటిన్ తప్పనిసరి. ఇవన్నీవుండి.. రూ.10 లక్షల వార్షిక ఫీజు కడితేనే సదరు యాజమాన్యానికి తమ కార్యాలయంలో మద్యాన్ని అందుబాటులో ఉంచుకునేందుకు లైసెన్స్ ఇచ్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments