Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడికూరలో పురుగులు - ఆందోళనకు దిగిన విద్యార్థులు

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (10:34 IST)
దేశంలో ఉన్న ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఉస్మానియా యూనివర్శిటీ ఒకటి. అయితే, ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండే విద్యార్థుల వసతి గృహాల్లో మాత్రం నాసికరకం ఆహారాన్ని అందిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. దీనితోడు వంట సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తాజాగా మహిళా వసతి గృహంలో వండిన చికెన్ కర్రీలో పురుగులు కనిపించాయి. దీంతో విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. 
 
ఆదివారం మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో లేడీస్ హాస్టల్‌ మెస్‌లో ఓ విద్యార్థినికి చికెన్ కర్రీలో పురుగు వచ్చిందని, అక్కడున్న సిబ్బందని నిలదీశారు. అయితే వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో విద్యార్థులంతా కలిసి వసతిగృహం ముందు రోడ్డుపై బైఠాయించారు.
 
ఉన్నత చదువుల కోసం తాము ఓయూకు వస్తే ఇక్కడ మరుగుదొడ్లు కూడా సరిగా లేవని, మంచినీటి సౌకర్యం కూడా లేదని, నాణ్యమైన ఆహారం అందించడం లేదని వాపోయారు. ఈ ఆందోళన ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు సాగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments