Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడికూరలో పురుగులు - ఆందోళనకు దిగిన విద్యార్థులు

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (10:34 IST)
దేశంలో ఉన్న ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఉస్మానియా యూనివర్శిటీ ఒకటి. అయితే, ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండే విద్యార్థుల వసతి గృహాల్లో మాత్రం నాసికరకం ఆహారాన్ని అందిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. దీనితోడు వంట సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తాజాగా మహిళా వసతి గృహంలో వండిన చికెన్ కర్రీలో పురుగులు కనిపించాయి. దీంతో విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. 
 
ఆదివారం మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో లేడీస్ హాస్టల్‌ మెస్‌లో ఓ విద్యార్థినికి చికెన్ కర్రీలో పురుగు వచ్చిందని, అక్కడున్న సిబ్బందని నిలదీశారు. అయితే వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో విద్యార్థులంతా కలిసి వసతిగృహం ముందు రోడ్డుపై బైఠాయించారు.
 
ఉన్నత చదువుల కోసం తాము ఓయూకు వస్తే ఇక్కడ మరుగుదొడ్లు కూడా సరిగా లేవని, మంచినీటి సౌకర్యం కూడా లేదని, నాణ్యమైన ఆహారం అందించడం లేదని వాపోయారు. ఈ ఆందోళన ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు సాగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవర అద్భుతమైన విజయం పట్ల అందరికీ కృతజ్ఞతలు తెలిపిన ఎన్టీఆర్‌

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అఖండ 2 ప్రారంభం

ఓజీ షూటింగ్‌కు హాజరుకానున్న పవన్ కళ్యాణ్?

ఫీమేల్ ఓరియెంటెడ్‌గా ప్రియాంక ఉపేంద్ర ఉగ్రావతారం సినిమా

వరుణ్ తేజ్ మట్కా పవర్ ప్యాక్డ్ రిలీజ్ న్యూ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ప్రతిరోజూ రాత్రిపూట ఒక్క యాలుక్కాయ తింటే?

హైదరాబాద్ తర్వాత ప్రపంచంలోనే తొలిసారిగా పరాయి గడ్డ యూకెలో అలాయి బలాయి

డార్క్ చాక్లెట్ తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందా?

ఐరన్ లోపం వున్నవాళ్లు ఈ పదార్థాలు తింటే ఎంతో మేలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments