Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చైతన్యపురిలో దారుణం : ఉద్యోగం పేరుతో యువతిపై అత్యాచారం

చైతన్యపురిలో దారుణం : ఉద్యోగం పేరుతో యువతిపై అత్యాచారం
, సోమవారం, 28 మార్చి 2022 (09:22 IST)
హైదరాబాద్ నగరంలోని చైతన్యపురిలో దారుణం జరిగింది. ఉద్యోగం పేరుతో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. ఉద్యోగం ఇస్తానని ఫోన్ చేసి నమ్మించిన సిద్ధార్థ్ రెడ్డి అనే కామాంధుడు.. యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ నెల 9వ తేదీన దిల్‌సుఖ్ నగర్‌కు వచ్చి ఎస్సార్ నగర్‌కు తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. పైగా, ఆ యువతి పేరుతోనే లాడ్జీలో గదిని బుక్ చేసుకుని అత్యాచారం చేయడమేకాకుండా, ఈ విషయాన్ని బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలానికి చెందిన 19 యేళ్ల యువతి నాలుగేళ్లుగా దిల్‌సుఖ్ నగర్‌లోని చైతన్యపురి కాలనీలో ఉంటూ టెలీకాలర్‌గా పని చేస్తుంది. ఈ నెల 7వ తేదీన సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి ఆెకు ఫోన్ చేసి తమ కంపెనీలో ఉద్యోగం ఉందని, నెలకు రూ.18 వేల జీతం ఇస్తానని  నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన ఆ యువతి ఉద్యోగానికి అంగీకరించింది. 
 
ఈ నెల 9వ తేదీన దిల్‌సుఖ్ నగర్‌కు వచ్చి సిద్ధార్థ్ రెడ్డి (23) ఆ యువతిని ఎక్కించుకుని యర్రగడ్డకు తీసుకెళ్లారు. అక్కడ ఆమె గుర్తింపు కార్డులు, ఫోటోలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఎస్సార్ నగర్‌లోని ఓ లాడ్జీలో ఆ యువతి పేరుతో రూమ్ బుక్ చేశాడు. దీంతో భయపడిన ఆ యువతి అతన్ని నిలదీసింది. అయితే, రాత్రి భోజన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందామని, అడ్వాన్స్ కూడా ఇస్తానని నమ్మించాడు. 
 
అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడు. అయితే, ఆ కామాంధుడు నుంచి తప్పించుకున్న యువతి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చేరవేసి ఆ తర్వాత చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును ఎస్సార్ నగర్ స్టేషన్‌కు తరలించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై దాడి - వీడియో వైరల్