Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికిత్స కోసం వెళితే కువైట్ సేఠ్‌కు అమ్మేసిన వైద్యుడు..

Webdunia
గురువారం, 14 జనవరి 2021 (08:35 IST)
అనారోగ్యం చేసిన ఓ మహిళ చికిత్స కోసం ఆస్పత్రికి వెళితే ఆమెను కువైట్ సేఠ్‌కు రెండు లక్షల రూపాయలకు అమ్మేశాడో వైద్యుడు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, టోలీచౌకి సమతా కాలనీకి చెందిన తాహేరాబేగం (40) అనే మహిళ... అనారోగ్యంతో బాధపడుతూ గోల్కొండ కోటరా హౌస్ వద్ద ఉన్న షిఫా క్లినిక్‌కు వెళ్లింది. ఆ క్లినిక్‌ను నడుపుతున్న వైద్యుడు షబ్బీర్ హుస్సేన్‌.. ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. 
 
ఆ చర్వాత కువైట్‌లో ఓ ఇంట్లో పనిమనిషిగా చేరితే నెలకు రూ.25 వేలు సంపాదించవచ్చని ఆశ చూపాడు. కుమార్తెకు పెళ్లి చేసి అప్పులపాలైన తాహేరాబేగం ఆ వైద్యుడు మాటలు నమ్మి సమ్మతించింది. ఈ క్రమలో గతేడాది ఫిబ్రవరి 3వ తేదీన తాహేరాబేగం కువైట్ వెళ్లింది. అయితే, ఆమెను ఏకంగా కువైట్ సేఠ్ అల్ షమారీ అనే వ్యక్తికి అమ్మేశాడు. ఈ విషయం తెలియని తాహేరాబేగం.. కువైట్‌కు వెళ్లింది. ఇంట్లో పనికి చేరిన తర్వాత నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. తినడానికి తిండి కూడా సరిగా పెట్టడం మానేశారు. 
 
దీంతో తనను స్వదేశానికి పంపించాలంటూ మొరపెట్టుకుంది. కానీ, ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. పైగా, తాను రెండు లక్షల రూపాయలు ఇచ్చి నిన్ను కొనుగోలు చేసుకున్నానని యజమాని చెప్పడంతో ఆమె విస్తుపోయింది. దీంతో విషయాన్ని ఆమె హైదరాబాద్‌లో ఉన్న కుమార్తెకు చెప్పింది. ఆమె ఎంబీటీ నేత అమ్జాదుల్లాఖాన్ దృష్టికి తీసుకెళ్లింది. ఆయన ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments