Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైకు ఢీకొన్ని పూర్తిగా కాలిపోయిన బస్సు... బైకర్ సజీవదహనం

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2023 (13:57 IST)
మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి శామీర్ పేట మండలంలోని జీనోమ్ వ్యాలీలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఫార్మా కంపెనీ ఉద్యోగులతో వెళుతున్న బస్సును మంగళవారం ఉదయం ఓ బైకర్ ఢీకొన్నాడు. దీంతో బైకు పెట్రోల్ ట్యాంక్ పగిలి మంటలు ఎసిగిపడ్డాయి. ఈ మంటలు బస్సుకు కూడా వ్యాపించడంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. మంటల్లో చిక్కుకున్న బైకర్ సజీవదహనమయ్యాడు. అయితే, మంటలు ఒక్కసారిగా చెలరేగగానే బస్సులోని ప్రయాణికులంతా ప్రాణభయంతో క్షేమంగా బయటపడ్డారు. 
 
ఈ ప్రమాదంపై బస్సులోని ప్రయాణికులు స్పందిస్తూ, యూజే ఫార్మా కంపెనీ ఉద్యోగి సంపత్ విధులకు హాజరయ్యేందుకు బైకుపై వెళుతున్నాడు. కొల్తూరు వద్ద బైక్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఫార్మా కంపెనీ బస్సును ఢీకొట్టింది. దీంతో బైకుతో సహా సంపత్ కిందపడ్డాడు. అదేసమయంలో బైకు పెట్రోల్ ట్యాంకు పగిలిపోవడంతో ఒక్కసారిగా మంటలు అంటున్నాయి. దీంతో బస్సు, బైకు రెండూ కాలిపోయాయి. ఈ మంటల్లో చిక్కుకున్న బైకర్ సంపత్ సజీవదహనమయ్యాడు. మృతుడి స్వస్థలం సిద్ధిపేట జిల్లా ములుగు మండలం వరదరాజపురం అని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిసున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments