Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైకు ఢీకొన్ని పూర్తిగా కాలిపోయిన బస్సు... బైకర్ సజీవదహనం

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2023 (13:57 IST)
మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి శామీర్ పేట మండలంలోని జీనోమ్ వ్యాలీలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఫార్మా కంపెనీ ఉద్యోగులతో వెళుతున్న బస్సును మంగళవారం ఉదయం ఓ బైకర్ ఢీకొన్నాడు. దీంతో బైకు పెట్రోల్ ట్యాంక్ పగిలి మంటలు ఎసిగిపడ్డాయి. ఈ మంటలు బస్సుకు కూడా వ్యాపించడంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. మంటల్లో చిక్కుకున్న బైకర్ సజీవదహనమయ్యాడు. అయితే, మంటలు ఒక్కసారిగా చెలరేగగానే బస్సులోని ప్రయాణికులంతా ప్రాణభయంతో క్షేమంగా బయటపడ్డారు. 
 
ఈ ప్రమాదంపై బస్సులోని ప్రయాణికులు స్పందిస్తూ, యూజే ఫార్మా కంపెనీ ఉద్యోగి సంపత్ విధులకు హాజరయ్యేందుకు బైకుపై వెళుతున్నాడు. కొల్తూరు వద్ద బైక్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఫార్మా కంపెనీ బస్సును ఢీకొట్టింది. దీంతో బైకుతో సహా సంపత్ కిందపడ్డాడు. అదేసమయంలో బైకు పెట్రోల్ ట్యాంకు పగిలిపోవడంతో ఒక్కసారిగా మంటలు అంటున్నాయి. దీంతో బస్సు, బైకు రెండూ కాలిపోయాయి. ఈ మంటల్లో చిక్కుకున్న బైకర్ సంపత్ సజీవదహనమయ్యాడు. మృతుడి స్వస్థలం సిద్ధిపేట జిల్లా ములుగు మండలం వరదరాజపురం అని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments