Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూబ్లీహిల్స్‌లో ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు తీసిన అతివేగం..

Webdunia
ఆదివారం, 1 జనవరి 2023 (17:31 IST)
హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లో కొత్త సంవత్సరాది రోజున అతివేగం ఇద్దరి వ్యక్తుల ప్రాణాలు హరించింది. న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని సంతోషంతో ఇంటికి వెళుతున్న ఓ కారు ప్రమాదానికి గురైంది. ఇందులో ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు కోల్పోయారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి పంజాగుట్ట వెళ్లే ప్రధాన రహదారిలో ఈ ప్రమాదం జరిగింది. 
 
మృతులను గుర్తించాల్సివుంది. విద్యా నగర్‌కు చెందిన ప్రణవ్, వర్థన్‌లుగా కలిసి కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొని తిరిగి సెలీరియా కారులో ఇంటికి బయలుదేరారు. ఈ కారును అమిత వేగంతో నడపడం వల్ల ఓ మలుపు వద్ద కారు వేగాన్ని నియంత్రించలేక పక్కనే నడిచి వెళుతున్న పాదాచారులను, మరో రెండు కార్లను బలంగా ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై వెళుతున్న ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ ప్రమాదంలో వర్ధన్ తీవ్రంగా ప్రణవ్ గాయపడగా, అతన్ని వెల్‌నెస్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తన స్నేహితుడు వర్థన్‌తో కలిసి ప్రణవ్ మద్యం సేవించి వాహనం నడిపినట్టు పోలీసులు గుర్తించారు. ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదానికి కారణమైన ప్రణవ్, వర్థన్‌లు మణిపాల్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments