హుజురాబాద్ బైపోల్ : ఈటెల రాజేందర్ కోసం అమిత్

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (09:43 IST)
తెలంగాణా రాష్ట్రంలోని హుజురాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల సమయం సమీపిస్తుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగా ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరుగనుంది. 
 
కాగా, నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలు తెరాస, బీజేపీ, కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించడంతో పాటు స్టార్ క్యాంపెయినర్‌లను ప్రకటించాయి. 
 
అయితే హుజురాబాద్ ఎన్నికల కోసం బీజేపీ అధిష్టానం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా రంగంలోకి దించబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈటెల కోసమే ఆయన ప్రచారానికి వస్తున్నట్టు సమాచారం. 
 
తెరాసకు ధీటుగా ఈ ఎన్నికలను తీసుకున్న బీజేపీ ఓటర్లను ఆకర్షించేందుకు అమిత్ షా తో ఓ భారీ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం భారీ బహిరంగ సభను నిర్వహించేలా ప్లాన్ చేస్తుంది. 
 
ఇదిలావుంటే, అమిత్ షా తరచూ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఉప ఎన్నికల ప్రచారానికి అయినా ఇతర సందర్భాల్లోనూ అమిత్ షా భారీ సభలు ఏర్పాటు చేస్తూ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments