Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుజురాబాద్ బైపోల్ : ఈటెల రాజేందర్ కోసం అమిత్

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (09:43 IST)
తెలంగాణా రాష్ట్రంలోని హుజురాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల సమయం సమీపిస్తుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగా ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరుగనుంది. 
 
కాగా, నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలు తెరాస, బీజేపీ, కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించడంతో పాటు స్టార్ క్యాంపెయినర్‌లను ప్రకటించాయి. 
 
అయితే హుజురాబాద్ ఎన్నికల కోసం బీజేపీ అధిష్టానం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా రంగంలోకి దించబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈటెల కోసమే ఆయన ప్రచారానికి వస్తున్నట్టు సమాచారం. 
 
తెరాసకు ధీటుగా ఈ ఎన్నికలను తీసుకున్న బీజేపీ ఓటర్లను ఆకర్షించేందుకు అమిత్ షా తో ఓ భారీ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం భారీ బహిరంగ సభను నిర్వహించేలా ప్లాన్ చేస్తుంది. 
 
ఇదిలావుంటే, అమిత్ షా తరచూ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఉప ఎన్నికల ప్రచారానికి అయినా ఇతర సందర్భాల్లోనూ అమిత్ షా భారీ సభలు ఏర్పాటు చేస్తూ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఆయన ఆశీస్సులు వున్నంతకాలం నన్నెవరూ ఆపలేరు : ఎన్.టి.ఆర్.

ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి డేటింగ్ వెళ్లివుంటేనా? : ఎమ్మా థాంప్సన్ షాకింగ్ కామెంట్స్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments