Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం ఎలా జరిగిందంటే...

Webdunia
శనివారం, 22 ఆగస్టు 2020 (11:26 IST)
శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో గురువారం రాత్రి సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ఒక ఏసీతో సహా మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్లాంట్‌లోని పవర్ సర్క్యూట్ ప్లాంట్‌లో ఏర్పడిన విద్యుదాఘాతం కారణంగా సంభవించింది. ముఖ్యంగా, షార్ట్‌సర్క్యూట్‌ జరిగి ప్యానల్‌ బోర్డుకు చిన్నపాటి మంటలు చెలరేగాయి. ఈ మంటలను విధుల్లో ఉన్న సిబ్బంది ఆర్పేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. 
 
మంటలు అంటుకున్న ప్యానల్‌ బోర్డుకు రెండు వేర్వేరు మార్గాల నుంచి బ్యాటరీల నుంచి డైరెక్ట్‌ కరెంట్‌(డీసీ) అందుతుండేది. ప్రమాద సమయంలో రెండు స్విచ్‌లూ పనిచేయలేదని తేలింది. ఆ స్విచ్‌లు పనిచేసి ఉంటే... ఐదు నిమిషాల్లోపే అగ్నిప్రమాదం అదుపులోకి వచ్చి ఉండేదని నిపుణులు చెబుతున్నారు. మంటలే మరింత చెలరేగడానికి.. ప్యానల్‌ బోర్డుకు విద్యుత్తు సరఫరా అవుతుండటమే కారణమని వారు వివరిస్తున్నారు. 
 
కాగా, జెన్‌కో వర్గాలు మాత్రం నిర్వహణలో లోపాలున్నాయనే వాదనను ఖండిస్తున్నాయి. పవర్‌హౌజ్‌లో ప్రమాదం సంభవించిన వెంటనే మంటలు వేగంగా వ్యాపించాయని, దీంతో అక్కడ ఆక్సిజన్‌ స్థాయులు పడిపోయాయని.. పొగ కమ్మేయడంతో బయటకు రాలేని స్థితి ఏర్పడి ప్రాణాలు కోల్పోయారని వారు చెబుతున్నారు. ఏదేమైనా, ఈ ప్రమాదంపై లోతైన విచారణ జరిపి, బాధ్యులను శిక్షించాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments