Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో అసదుద్దీన్ ఇంటిపై దాడి... గూండాలను రెచ్చగొట్టారు: ఒవైసీ

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (07:27 IST)
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై దాడి జరిగింది. ఢిల్లీలోని అశోకా రోడ్డులో ఉన్న ఇంటిపై హిందూ సేనకు చెందిన కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో ఆయన నివాసం పాక్షికంగా ధ్వంసమైంది. కిటికీలు దెబ్బతిన్నాయి. ఈ దాడి ఘటనకు సంబంధించి ఐదుగురు హిందూ సేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నామని డీసీపీ దీపక్‌ యాదవ్‌ తెలిపారు. 
 
మరోవైరు, ఈ దాడి ఘటనపై ఎంపీ అసదుద్దీన్ స్పందించారు. తన నివాసంపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. గూండాలను రెచ్చగొట్టి తన ఇంటిపై దాడి చేయించారన్నారు. దేశ రాజధానిలో ఓ ఎంపీ నివాసం సురక్షితంగా లేకపోతే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఏం జవాబు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. 
 
'నేను లేని సమయంలో ఢిల్లీలో గూండాలు ఆయుధాలతో గుంపులుగా వెళ్లి, నా ఇంటిపై కర్రలు, గొడ్డళ్లతో దాడి చేసి పారిపోయారు. ఈ దాడిలో నా ఇంటి కాపలాదారు గాయపడ్డాడు. దాడులతో భయపెట్టలేరు. మజ్లిస్‌ అంటే ఏమిటో ఆ గూండాలకు తెలీదు' అని ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments