Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిన్న ఆఫీసులు... నేడు నివాసాలు : సోనూసూద్‌పై ఐటీ గురి

నిన్న ఆఫీసులు... నేడు నివాసాలు : సోనూసూద్‌పై ఐటీ గురి
, గురువారం, 16 సెప్టెంబరు 2021 (15:18 IST)
కరోనా కష్టకాలంలో ఎంతో మందికి ఆపద్బాంధవుడుగా ఉన్న బాలీవుడ్ నటుడు సోనూసూద్‌పై ఐటీ శాఖ గురిపెట్టింది. బుధవారం ముంబైలోని ఆరు ప్రాంతాల్లోని ఆయన కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. రెండోరోజైన గురువారం ఆయన నివాసాల్లో తనిఖీలు చేస్తున్నారు. 
 
లక్నోకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థతో సోనూ చేసుకున్న ఒప్పందాలపై అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. డీల్‌కు‌ సంబంధించి పన్ను ఎగవేశారన్న ఆరోపణలు వచ్చాయని, దానిపైనే దర్యాప్తు సాగుతోందని ఓ అధికారి చెప్పారు. ఈ తనిఖీలు కేవలం ‘సర్వే’ మాత్రమేనని చెప్పుకొచ్చారు.
 
బుధవారం ముంబైలోని జుహులో ఉన్న సోనూ స్వచ్ఛంద సంస్థతో పాటు ఆరు ప్రాంతాల్లో ఉన్న ఆఫీసులు, ఇళ్లలో అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాలు అర్థరాత్రి వరకు కొనసాగాయి. 20 గంటల పాటు పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే, ప్రతిపక్షాలు ఈ దాడులపై మండిపడుతున్నాయి. 
 
కరోనా సమయంలో ఎంతో మందిని ఆదుకున్న సోనూకు గుర్తింపు రావడం వల్లే ప్రభుత్వం కక్షగట్టిందని ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఇటీవలే ఢిల్లీ ప్రభుత్వం సోనూను అంబాసిడర్‌గా నియమించుకుంది. అందుకే బీజేపీ ప్రభుత్వం కక్షగట్టి ఈ సోదాలు చేయిస్తోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైనార్టీలకు సబ్ ప్లాన్‌ ఏర్పాటుకు ఏపీ కేబినెట్‌ ఆమోద ముద్ర