Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంద‌రినీ కాపాడాల‌ని క‌న‌క‌దుర్గ అమ్మ‌వారిని కోరిన‌ సోనూసూద్‌

Advertiesment
Sonu Sood
, గురువారం, 9 సెప్టెంబరు 2021 (14:55 IST)
Sonusood-temple
దేశానికి తెలిసిన పేరు సోనూసూద్. త‌ను ఒక‌వైపు షూటింగ్ లు చేస్తూనే మ‌రోవైపు స‌మాజ సేవ చేస్తూనే వుంటున్నారు. క‌రోనా టైంలో ఆయ‌న చేసిన సేవ‌లు అంద‌రికీ తెలిసిందే. దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్క‌డ ప్ర‌ముఖ ఆల‌యాల‌ను సంద‌ర్శిస్తూనే వుంటారు.

webdunia
Sonusood-temple
గురువారంనాడు సోనూసూద్ విజ‌య‌వాడ‌కు వెళ్ళారు. అక్క‌డ అంకుర ఆసుప‌త్రి నూత‌న బ్రాంచ్ ఏర్పాటుకు ఆయ‌న ఆహ్వానితులుగా హాజ‌ర‌య్యారు. ఇంత‌కు ముందు కూడా ఇటువంటి కార్య‌క్ర‌మానికి హాజ‌రై త‌న‌కు త‌గిన సాయం చేస్తాన‌ని హామీ ఇచ్చారు.  క‌రోనా త‌ర్వాత ఆసుప‌త్రుల‌లో ఆక్సిజ‌న్ స్థాయిలు ఏమేరకు వున్నాయో ఆయ‌న తెలుసుకోవ‌డం విశేషం.
 
webdunia
Sonusood-temple
ఆసుప‌త్రి ప్రారంభోత్స‌వం అనంత‌రం ఆయ‌న విజ‌య‌వాడ‌లోని క‌న‌క‌ద‌గ్గ‌మ్మ అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. ఆయ‌న రాక తెలిసిన వంద‌లాది భ‌క్తులు ఆయ‌న‌తో ఫొటోలు దిగడానికి ఉత్సాహాన్ని చూపారు. అమ్మ‌వారి ఆల‌యంలోని ప్ర‌ధాన అర్చ‌కులు ఆయ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, అమ్మ‌వారి ఆశీస్సులు అంద‌రికీ వుండాల‌ని కోరుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జెస్సీ కాలు పట్టుకున్న ఆనీ మాస్టర్.. ఓ రేంజ్‌లో గొడవ జరిగింది..