Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో భానుడి ప్రతాపం - వడదెబ్బకు ఐదుగురు మృతి

Webdunia
మంగళవారం, 3 మే 2022 (08:53 IST)
తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ముఖ్యంగా, తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఉష్ణతాపం కారణంగా అనేక వడదెబ్బకు గురవుతున్నారు. తెలంగాణాలో వడదెబ్బ తగలడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఒక్క రోజే వీరంతా చనిపోయారు. 
 
మృతులను ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూలు మండలం రాజులగూడకు చెందిన గుణాజీ అనే ఆరేళ్ళ బాలుడు, అదే గ్రామానికి చెందిన ఆర్ఎంపీ బాలాజీ (45)లు వడదెబ్బకు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, బోధ్ మండలంలో ఓ నిర్మాణ కూలి (32), సూర్యాపేట నాగారం మండలం ఈటూరుకు చెందిన రైతు తిగుళ్ల అంజయ్య (48), యాదాద్రి జిల్లా భువనగిరి మండలం రెడ్డినాయక్ తండాకు చెందిన బుజ్జమ్మ (45)లు కూడా వడదెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోయారు.
 
ఇదిలావుంటే, రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు గరిష్ట స్థాయిలోఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అలాగే, పగటి ఉష్ణోగ్రతలపై జాగ్రత్తగా ఉండాలంటూ ఆరెంజ్ హెచ్చరికను కూడా జారీచేశారు. కాగా, సోమవారం ఆదిలాబాద్ జిల్లాలోని భోరజ్‌లో సోమవారం అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యాడ్ స్క్వేర్ నుంచి లడ్డు గాని పెళ్లి గీతం విడుదల

అక్కినేని నాగేశ్వరరావు ప్రయాణం ప్రతి ఒక్కరికి ప్రేరణ : నందమూరి బాలకృష్ణ

ఏయన్నార్ కృషి - కీర్తి - స్పూర్తి ప్రతి నటునికి మార్గదర్శకం : బాలకృష్ణ

మహేష్ బాబు సినిమా అప్ డేట్ అడిగితే కర్రతీసిన రాజమౌళి

పీరియాడిక్ యాక్షన్ లో కొత్త కాన్సెప్ట్ తో నవంబర్ 14న రాబోతున్న కంగువ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments