తెల్లారితే పెళ్ళి - వేధింపులు భరించలేక వధువు ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 3 మే 2022 (08:33 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. తెల్లారితే వివాహం కావాల్సిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో పెళ్ళి బాజాభజంత్రీలు మోగాల్సిన ఇంటి చావుడబ్బులు మోగుతున్నాయి. దీనికి కారణం ఓ యువకుడు వేధింపులు. ఈ కామాంధుడి వేధింపులు భరించలేని ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. 
 
పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని మక్తల్ పరిధిలో ఉన్న చందాపూర్ అనే గ్రామానికి చెందిన భూమేశ్వరి (19) అనే యువతికి దండు గ్రామానికి చెందిన యువకుడితో పది రోజుల క్రితం పెళ్లి నిశ్చితార్థం జరిగింది. మంగళవారం ఉదయం వివాహం జరగాల్సివుంది. 
 
ఇరు కుటుంబాలు ఈ పెళ్లి ఏర్పాట్లను ఘనంగా చేశారు. ఇంతలోనే వధువు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. సోమవారం తెల్లవారుజామున భీమేశ్వరి తన ఇంట్లోనే చున్నీతో ఉరిబిగించుకుని ప్రాణాలు తీసుకుంది. కుమార్తె విగతజీవిగా మారడాన్ని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు గుండెలు అలసిపోయేలా రోదించారు. 
 
తనకు నిశ్చితార్థం అయినట్టు తెలిసినా చందాపూర్‌కే చెందిన లిక్కి అలియాస్ సిరిపి నర్సింహులు ప్రేమ పేరుతో నిత్యం వేధిస్తున్నారని, అతని వేధింపులు భరించలేకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసూడై నోట్ రాసిపెట్టింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments