Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేషన్ కార్డు లేకపోయినా ఆహార ధాన్యాలు ఇవ్వాల్సిందే : హైకోర్టు

Webdunia
గురువారం, 14 మే 2020 (14:43 IST)
తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. లాక్డౌన్ సమయంలో రేషన్ కార్డు ఉన్న వినియోగదారులకు ఉచితంగా బియ్యంతో పాటు.. ఇతర సరకులను పంపిణీ చేస్తున్నారు. దీనిపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా.. ప్రతి ఒక్కరికీ ఉచితంగా రేషన్ సరకులు ఇవ్వాలని ఆదేశించింది. అలాగే, బయోమెట్రిక్‌తో పని లేకుండా అందజేయాలని తెలంగాణ సర్కారును ఆదేశించింది. 
 
లాక్డౌన్ సమయంలో కేవలం రేషన్ కార్డు ఉన్నా వారికి మాత్రమే ప్రభుత్వం వివిధ రకాల రేషన్ సరుకులు, నగదును పంపిణీ చేస్తోంది. దీంతో రేషన్ కార్డు లేని పేదలు అనేక మంది ఉన్నారనీ, వారందరికీ కూడా ఉచితంగా రేషన్ సరకులు పంపిణీ చేయాలని కోరుతూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. 
 
దీనిపై విచారణ జరిపిన కోర్టు పై విధంగా ఆదేశించింది. అంతేకాకుండా ఎలాంటి సమాచారం లేకుండా 8 లక్షల రేషన్ కార్డులు ఎలా రద్దు చేస్తారంటూ హైకోర్టు ప్రశ్నించింది. అందువల్ల వలస కూలీలతో పాటు పేదలకు ఉచితంగా రేషన్ సరకులు, రూ.1500 నగద ఇవ్వాలని ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments