తెలంగాణాలో దారుణం, రెండేళ్లుగా యువతిపై తాత, మేనమామల అత్యాచారం

Webdunia
బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (19:37 IST)
తెలంగాణలో సభ్య సమాజం తలదించుకునే మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. లాలనగా చూడాల్సి మనవారిలిపై ఓ తాత తన పైశాచికత్వం చూపించాడు. అంతేకాదు బాధ్యతగా మేనకోడలిని రక్షించాల్సిన మేనమామ సైతం ఆమెపై తన క్రూరత్వం ప్రదర్శించాడు. ఫలితంగా తాను ఉంటున్న ఇంట్లోనే.. నా అనుకున్నవారి చేతిలోనే... ఆ యువతికి తీరని అన్యాయం జరిగింది. 
 
తాత, మేనమామ కలిసి ఆమెపై గత రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతుండటంతో.. భరించలేని ఆ అభాగ్యురాలు చివరికి జరిగిన దారుణాన్ని తన తల్లికి తెలిపింది. దీంతో బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
 
బండ్లగూడ మహ్మద్‌ నగర్‌కు చెందిన షేక్‌ అఫ్సర్‌‌కు 70 ఏళ్లు. ఆయన మనవరాలికి 19 ఏళ్లు. చిన్నతనం నుంచే తాత ఇంట్లోనే పెరిగింది. బాలికపై కన్నేసిన తాతయ్య షేక్‌ అఫ్సర్‌ రెండేళ్ల క్రితం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతని కుమారుడు షేక్‌ సిద్దిఖ్‌ సైతం ఆరు నెలల క్రితం ఆమెపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించారు. బాధితురాలు ఈ విషయాన్ని తన తల్లికి చెప్పడంతో ఆమె చాంద్రాయణగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తండ్రి, కొడుకులపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం