Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగరేణి ప్రైవేటుపరానికి కేంద్రం కుట్ర : బాల్క సుమన్

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (14:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేసినట్టే సింగరేణి బొగ్గుగనులపై కూడా కూడా కేంద్రం కుట్ర చేస్తుందని తెలంగాణ ప్రభుత్వ విప్ బాల్కసుమన్ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, సింగరేణి కార్మికులు సమ్మెకు దిగితే సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. 
 
విశాఖ ఉక్కు కర్మాగారానికి గనులు కేటాయించాలని పదేపదే విన్నవించుకుంటున్నప్పటికీ కర్మాగారాన్ని నష్టాలు వచ్చేలా చేసి అమ్మే కుట్ర చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇపుడు విశాఖ ఉక్క ఫ్యాక్టరీ లాగానే సింగరేణిని కూడా ప్రైవేట్ పరం చేయాలని కుట్ర జరుగుతోందని ఆయన మండిపడ్డారు. 
 
సింగరేణి బొగ్గు గనుల విషయంలో కేంద్రం వైఖరి మార్చుకోకపోతే ఢిల్లీలో ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇదే అంశంపై కేంద్రానికి సీఎం లేఖ రాశారనీ అయినా కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. గుజరాత్‌లో గనులు అక్కడి ప్రభుత్వానికి అప్పగించి, తెలంగాణాకు సింగరేణి గనులు ఎందుకు ఇవ్వరంటూ ఆయన నిలదీశారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments