Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్‌ కారుకు ప్రమాదం....

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్ కారుకు కరీంనగర్ జిల్లాలో పెను ప్రమాదం జరిగింది. ఈ కారును మరో కారు వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. మరొకరు గాయపడ్డారు. అతని పరిస్థితి విషమంగా

Webdunia
సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (12:13 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్ కారుకు కరీంనగర్ జిల్లాలో పెను ప్రమాదం జరిగింది. ఈ కారును మరో కారు వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. మరొకరు గాయపడ్డారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన వ్యక్తిని మంచిర్యాల జిల్లాకు చెందిన సుందారపు గోపాల్‌గా గుర్తించారు. 
 
కొప్పుల ఈశ్వర్ తన కుమారుడి పెళ్లి పత్రికలను వేములవాడ ఆలయంలో సమర్పించేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వ్యక్తి పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో వరంగల్ ఆస్పత్రికి తరలించారు. కొప్పుల ఈశ్వర్ డ్రైవర్ కారును డీజిల్ పోయించేందుకు తీసుకెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో కొప్పుల ఈశ్వర్ కారులో లేరు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments