Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత విగ్రహం కాదు.. సీఎం ఎడప్పాడి భార్య విగ్రహం!!

దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత పుట్టిన రోజు(ఫిబ్రవరి 24వ తేదీ)ను పురస్కరించుకుని ఆమె కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని చెన్నై, రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో నెలకొల్పారు.

Webdunia
సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (11:35 IST)
దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత పుట్టిన రోజు(ఫిబ్రవరి 24వ తేదీ)ను పురస్కరించుకుని ఆమె కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని చెన్నై, రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో నెలకొల్పారు. అయితే, ఈ విగ్రహాన్ని చూసిన ప్రతి ఒక్కరూ అది జయలలిత విగ్రహం కాదనీ, ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి విగ్రహం అంటూ సెటైర్లు వేస్తున్నారు. 
 
ఆ విగ్రహంలో జయ రూపురేఖలు లేవని... శశికళ, సీఎం పళనిస్వామి భార్య, అన్నాడీఎంకే సీనియర్ నాయకురాలు వలర్మతిల రూపురేఖలు ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. 
 
దీంతో, ఆ పార్టీ నేతలు కొంచెం వెనక్కి తగ్గారు. అన్నాడీఎంకే సీనియర్ నేత డి.జయకుమార్ మాట్లాడుతూ, విగ్రహంలో లోపాలు ఉన్నమాట వాస్తవమేనని చెప్పారు. వీలైనంత త్వరగా విగ్రహంలో మార్పులు చేయిస్తామని తెలిపారు. ఇలా జయలలిత లేని అన్నాడీఎంకే నేతలు మరోమారు అభాసుపాలయ్యారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments